AP News: ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన అధికారి సరిగా వ్యవహరించటం లేదని అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఫిట్మెంట్ 23శాతం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే రాతపూర్వకంగా తెలిపాం, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ అంశాలను ప్రభుత్వం తప్పకుండా పునఃసమీక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు ఏం చెప్పినా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. పీఆర్సీ జీవోలపై పునః సమీక్ష చేయాల్సిదేనన్నారు. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామనడం ఏమిటో అర్ధం కావడంలేదన్నారు. మధ్యంతర భృతిని రికవరీ చేసిన పరిస్థితి చరిత్రలో లేదని, అధికారులు సీఎంను తప్పుదోవ పట్టించారని భావిస్తున్నట్టు చెప్పారు.
రాజకీయ కోణంలో చూస్తే ఏ సీఎం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని భావించడం లేదన్నారు. సెంట్రల్ పే కమిషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉద్యోగులపై అధికారాన్ని వదిలేసుకుంటారా? అని ప్రశ్నించారు. పీఆర్సీ జీవోలను వెంటనే నిలిపివేయాలని, సీఎం నేతృత్వంలో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మరో రెండు నెలలు జాప్యమైనా ఫర్వాలేదు.. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ను కొనసాగించి ఉద్యోగులకు మేలే చేసేలా కసరత్తు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవో వల్ల 4 నుంచి 12శాతం జీతం కోతపడే ప్రమాదం ఉందని, ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికమీదకు రావాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. -
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వయసు మీద పడినా.. ఓటు బాధ్యత మరవలేదు
వయో వృద్ధులు ఓటుకు కదిలారు. ఎండను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు