Chandra babu: ఓకే గూగుల్‌.. ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 14 Oct 2025 19:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: ఓకే గూగుల్... సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ‘‘Ok Google’’ అనేది గూగుల్‌ అసిస్టెంట్‌ను ప్రారంభించే వాయిస్-యాక్టివేటెడ్ ట్రిగ్గర్. ఈ ట్రిగ్గర్‌ను వాడి చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ ఆకట్టుకుంటోంది. ‘గూగుల్ కమ్స్ టు ఏపీ’ హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టులో ఆయన పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు.

విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. దిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ బజ్వాలు పాల్గొన్నారు.

Tags :
Published : 14 Oct 2025 17:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని