Cyclone Montha: రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలు నిలిపివేయాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 28 Oct 2025 19:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: మొంథా తీవ్ర తుపాను (Cyclone Montha) ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలు రాత్రి 7గంటల నుంచి నిలపుదల చేయాలని పేర్కొంది. వాహనాలను ముందే సురక్షిత లేబేలో నిలుపుకోవాలని సూచించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

అత్యవసర వైద్య సేవలకోసం వెళ్లే వారికి మినహాయింపు..

తుఫాను ప్రభావిత కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, ఏఎస్ఆర్‌ జిల్లా, చింతూరు, రంపచోడవరం డివిజన్లలో తుపాను  ప్రభావం అధికంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం రాత్రి 8:30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారులపై వాహనాలను నిలిపివేయాలని ఆదేశించింది. జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఉంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను గడిచిన 6 గంటల్లో లో 15 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 50 కి.మీ, కాకినాడకు 130, విశాఖపట్నానికి 230 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.

Tags :
Published : 28 Oct 2025 17:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు