Kolusu parthasarathi: గత ప్రభుత్వ హయాంలో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయి: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 14 Jun 2025 12:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu parthasarathi) అన్నారు. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో 80 శాతం వరకు పూర్తి చేశామన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే ‘అమ్మ ఒడి’ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. స్త్రీశక్తి ద్వారా అన్నింటిలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. మహిళలను అవమానపరిచే చర్యలు వైకాపా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘గత వైకాపా ప్రభుత్వం హామీలకే పరిమితమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికొదిలేసింది. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారు. ఉన్న సంస్థలే ఈ రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయి’’ అని పార్థసారథి విమర్శించారు. (Andhra Pradesh News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు