Parthasarathy: ప్రకటనలకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.. బాధ్యులపై చర్యలు తప్పవ్‌: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 11 Mar 2025 11:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: వార్తా పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ శాసన మండలిలో ఛైర్మన్‌ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సాక్షి పత్రికకు రూ.400 కోట్లు చెల్లించారని చెప్పారు. దీనిపై విచారణకు సభా సంఘం వేయాలని మండలి ఛైర్మన్‌ను ఆయన కోరారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆ పత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం వాలంటీర్లకు రూ.200 చొప్పున చెల్లించిందని చెప్పారు. అక్రమంగా జరిగిన ఈ చెల్లింపులపై విచారణ చేపడతామని.. సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

వరద బాధితులకు జగన్‌ విరాళం ఇవ్వలేదు: మంత్రి 

మరోవైపు వరద బాధితులకు ఆర్థిక సాయంపై మండలిలో చర్చ జరిగింది. ప్రభుత్వానికి వైకాపా అధ్యక్షుడు జగన్‌ రూ.కోటి విరాళం ఇచ్చారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొనగా.. మంత్రి పార్థసారథి స్పందించారు. జగన్‌ ప్రభుత్వానికి విరాళం ఇవ్వలేదని తెలిపారు. దీనిపై విచారణకు కమిటీ వేసేందుకు సిద్ధమని హోంమంత్రి అనిత ప్రకటించారు.

Tags :
Published : 11 Mar 2025 11:50 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు