Purandeswari: శాంతియుత అణుశక్తికి అండగా భారత్‌.. ఐరాసలో ఎంపీ పురందేశ్వరి

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 30 Oct 2025 11:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) నివేదికపై దేశం తరఫున ఆమె మాట్లాడారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా వినియోగించుకోవడంలో ఐఏఈఏ పోషిస్తున్న కీలక పాత్రకు భారత్‌ తరపున మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని చెప్పారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అణు విద్యుత్ పరిశోధనల్లో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైందని వివరించారు. భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా ఐఏఈఏకి భారత్‌ సహకరిస్తోందన్నారు. (Andhra Pradesh News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని