Ashwini Vaishnav: తెలుగు రాష్ట్రాల్లో వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 28 Oct 2025 16:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: ‘మొంథా’ తీవ్ర తుపాను నేపథ్యంలో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఒడిశా, తెలుగురాష్ట్రాల్లో డివిజనల్‌ వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జీఎంలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి, యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొంథా తుపాను దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరారు. తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర వేళల్లో సత్వరం స్పందించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు