కోరికలు - భయక్రోధాలు
అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు.
అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు. మనిషి కోరికల స్థావరం! కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు.
భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిలో అంతరిక్షంలో తేలియాడే, అనేక నక్షత్ర గ్రహసముదాయాలు ఉన్నాయి! ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉందన్నది ఊహకు అందని విషయం.
జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం(బలం కోల్పోవడం), వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు. వార్ధక్య, మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు. మనిషి సాధన పండించుకుని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది. వెలుగు వెంట నీడలా భయం ఆవహిస్తుంది. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది.
కోరికలకు మూలం మనసు. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం. వైరాగ్య భావన అలవాటు చేయడం వల్ల మనసు మనిషి మాట వింటుంది. తర్ఫీదులో భాగంగా రుషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంద్రియాల(కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం) వల్లే మనిషికి కోరికలు కలుగుతాయి. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలు హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది. కోరికలూ తగ్గుముఖం పడతాయి.
సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గడాన్ని తెలుసుకుంటారు. కోరికలు తగ్గించుకున్నవారికి అవి తీరడం లేదన్న మనస్తాపం ఉండదు. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు. శరీరం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు.
రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి సామాన్యులను కలతకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటువంటి వ్యాధులు వారికి భయం కలగజేయలేదు. చేతకానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించినవారవుతారు. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ ఆనంద స్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది.
గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు