కోరికలు - భయక్రోధాలు
అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు.
అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు. మనిషి కోరికల స్థావరం! కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు.
భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిలో అంతరిక్షంలో తేలియాడే, అనేక నక్షత్ర గ్రహసముదాయాలు ఉన్నాయి! ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉందన్నది ఊహకు అందని విషయం.
జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం(బలం కోల్పోవడం), వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు. వార్ధక్య, మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు. మనిషి సాధన పండించుకుని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది. వెలుగు వెంట నీడలా భయం ఆవహిస్తుంది. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది.
కోరికలకు మూలం మనసు. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం. వైరాగ్య భావన అలవాటు చేయడం వల్ల మనసు మనిషి మాట వింటుంది. తర్ఫీదులో భాగంగా రుషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంద్రియాల(కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం) వల్లే మనిషికి కోరికలు కలుగుతాయి. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలు హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది. కోరికలూ తగ్గుముఖం పడతాయి.
సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గడాన్ని తెలుసుకుంటారు. కోరికలు తగ్గించుకున్నవారికి అవి తీరడం లేదన్న మనస్తాపం ఉండదు. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు. శరీరం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు.
రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి సామాన్యులను కలతకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటువంటి వ్యాధులు వారికి భయం కలగజేయలేదు. చేతకానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించినవారవుతారు. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ ఆనంద స్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది.
గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. -
పూరీ రథయాత్ర
పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?