అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు.
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. సరేనన్న సదాశివుడు బ్రహ్మ-విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభం రూపంలో ఆవిర్భవించాడు. పరమ తేజోమయమైన ఆ నిలువెత్తు అగ్ని స్తంభానికి తుది, మొదలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియలేదు. బ్రహ్మ-విష్ణువులు వాటిని కనుగొనేందుకు పోటీపడి వరాహ, హంస రూపాలతో బ్రహ్మదేవుడు తుదిని, విష్ణువు దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమవుతారు- ఆ కథలో.
ఇక్కడ మనం ఆలోచించవలసింది- వారిలో ఎవరు గెలిచారనీ కాదు, వారికన్నా శివుడు అధికుడా... అనీ కాదు. నిజానికి ఇదొక ప్రతీక. వరాహం భూమిని తవ్వుకొంటూ కిందకు వెళ్ళడమంటే మనిషి తన గతాన్ని అదే పనిగా గుర్తుచేసుకొంటూ జ్ఞాపకాలను చీల్చుకుంటూ, గాయాలను రేపుకొంటూ... ప్రయాణించడమని అర్థం. ఆ గతం అనంతం. మనిషి బుద్ధికి అందనంత లోతైనదది. కాబట్టే దాని అంతు తేల్చుకోవడంలో మనిషి విఫలమవుతాడు. తేజోమయ అగ్నికి మొదలేదో విష్ణువు తెలుసుకోలేకపోవడమంటే, అదీ అర్థం!
హంస రూపంలో బ్రహ్మ పైపైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడమనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమీ గ్రహించలేక పోవడానికి సూచన. భవిష్యత్తు విషయమై ఊహల రెక్కలపైనో, ఆశల ఊయలపైనో ఆకాశంలో విహరించడానికి సంకేతమే బ్రహ్మదేవుడి హంసవాహనం. వర్తమానాన్ని విడిచిపెట్టి నిన్నటిలోనో, రేపటిలోనో జీవించే మనిషికి మనశ్శాంతి కరవవుతుందని, పరాజయం ఎదురవు తుందని బోధించే కథ అది.
డబ్బుతో దేన్నయినా కొనవచ్చునని ఇప్పుడు ఎందరో పొరబడుతున్న మాదిరిగా, తన సంపదతో శ్రీకృష్ణుణ్ని సైతం తూచగలనని భావించి, భంగపడిన సత్యభామ దురహంకారానికి ప్రతీకే- శ్రీకృష్ణతులాభారం కథ. తన అధీనంలో ఉన్న ధనరాశులన్నీ ఆమె కుప్పబోసింది. ఎక్కడెక్కడో దాచిన సంపదలన్నీ చేరవేసింది. చివరకు ఒంటిమీది సొమ్ములన్నీ ఒలిచి ఇచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుణ్ని తన ‘పతిదేవుడు’ అని మాత్రమే అనుకొంది. ‘పతిగా దిగివచ్చిన దేవుడు’ అని గుర్తించలేకపోయింది. ఆమె విడిచిపెట్టవలసినవి నిజానికి తన దేహంపై సొమ్ములు కావు- తన లోపలి గుప్తనిధులు! దురభిమానం, అతిశయం, అహం... వంటి వాటిని ఆమె సంపదల మాదిరి గుండెల్లో దాచిపెట్టింది. ఆ గుప్తనిధులను విడుదల చేసేసరికి తిరిగి శ్రీకృష్ణుడు ఆమెకు వశమయ్యాడు. ఎవరికైనా సరే, వాటిని విడిచిపెట్టినప్పుడే భగవంతుడు వశం అవుతాడు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది.
కుచేలుడు ఎంత బాల్యమిత్రుడైతే మాత్రం- పిడికెడు అటుకులకే మురిసిపోయి కృష్ణుడు అఖండ ఐశ్వర్యాలను అనుగ్రహించడం మరీ విడ్డూరం కదూ... అనిపిస్తుంది. వాస్తవానికి ఆ గుప్పెడు... పిడికెడు... అనేది కుచేలుడి ‘చేతికొలత’ కాదని, అది ‘గుండె కలత’ అని గ్రహించినప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. హృదయాన్ని భగవంతుడికి సమర్పిస్తే సర్వసంపన్నులం కాగలమన్న ఎరుక ఏర్పడుతుంది. పురాణ కథల్లోని ప్రతీకలను, అంతరార్థాలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే మనలో అపార్థాలు తలెత్తుతాయని చెప్పే కథలివన్నీ!
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పర్శ... సాంత్వన!
స్పర్శ అంటే తాకడం. అది- తనువుకు తనువుకు; తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు... అనేక ఇంద్రియాలకు ఆనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణతిలతోపాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింప చేయడం స్పర్శ లక్షణం. -
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్