గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. ఐరావతానికి ఇతర ఏనుగుల్లా రెండు పొడవైన దంతాలు కాకుండా నాలుగుంటాయి. కొన్నిచిత్రాల్లో ఆరు దంతాలు కనిపిస్తాయి. ఐరావతాన్ని అభ్రమాతంగం అంటారు. అభ్రమంటే ఆకాశం, మేఘం అనే అర్థాలున్నాయి. మేఘాల్ని బంధించే ఏనుగని అర్థం. సూర్యుడి సోదరుడనే అర్థంలో అర్క సోదరుడనే పేరూ ఐరావతానికి ఉంది. దేవగురువు బృహస్పతికి, భూదేవికి ఏనుగు వాహనమని కొన్ని పురాణాలు పేర్కొన్నాయి. ఐరావతం దక్షిణ దిక్కులో ఉంటుందని పురాణోక్తి. భూమిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయని ప్రతీతి.
ఏనుగుకు సంబంధించి పౌరాణికంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక జీవనానికి సంబంధించి అనేక విషయాల ప్రసక్తి, ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. భూమిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయని పురాణోక్తి. భాగవతంలో గజేంద్ర మోక్షణ వృత్తాంతం ప్రసిద్ధం. ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యుడి శాపం వల్ల గజరాజై మొసలికి చిక్కి విష్ణువును ప్రార్థించి విముక్తి పొందాడు. సైన్యంలో చతురంగ బలాల్లో గజబలం ఉంటుంది. మహాభారతంలో అశ్వత్థామ పేరుతో ఏనుగు ఉండేది. ధర్మరాజు అసత్యం చెప్పవలసిన పరిస్థితిలో ఈ పేరు వాడుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షాన యుద్ధం చేసిన భగదత్తుడి ఏనుగు ప్రతీకం. భాగవతంలో కంసుడి ఏనుగు కువలయాపీడనం. అశోకచక్రవర్తి అగజాతమనే ఏనుగును అధిరోహించినట్లు ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో స్వామివారిని గజవాహనంపై ఊరేగించే సంప్రదాయం ఉంది. కేరళలో గురువాయూర్ శ్రీకృష్ణదేవాలయంలో 60 నుంచి 70 వరకు ఏనుగులు ఉంటాయి. సింహాచలంలో అప్పన్నకు వేములవాడ రాజన్నకు కోడె దూడల్ని సమర్పించే ఆచారం ఉన్నట్టు గురువాయూర్లో భక్తులు ఏనుగుల్ని బహూకరించే సంప్రదాయం ఉంది. కటకాన్ని పాలించే ప్రభువులను గజపతులుగా చరిత్ర పేర్కొంది. కాకతీయ రాజుల్లో ప్రతాపరుద్ర గజపతి ఉన్నాడు.
వినాయకుడు గజాననుడు. ఆ ఉదంతం పురాణ ప్రసిద్ధం. లోకంలో గొప్పదనాన్ని చెప్పే సందర్భాల్లో గజరాజుతో పోల్చడం తెలుగు నుడికారం ప్రత్యేకత. గజ ఈతగాడు, గజనిమ్మ, గజదొంగ, గజగమన, గజయాన, గజదంతం, గజకర్ణ మొదలైన పదాలు వాడుకలో ఉన్నాయి. రెండు వైపులా రెండు ఏనుగులు పూలదండలు పట్టుకొని నిలుచుండగా కనిపించే లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. ఏనుగుచుట్టూ లోకోక్తులు జాతీయాలు కొల్లలు. ఏనుగు కళ్లు మూసుకుంటే సింహం కలలో కనపడుతుందట. అందుకే సింహస్వప్నం మాట పుట్టింది. ఉన్నత లక్ష్యం ఏర్పరచుకోవడాన్ని కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనే వాక్యప్రయోగం ద్వారా వ్యక్తం చేస్తారు. ఏనుగు తిండి దానికి తగ్గట్టు అది చేసేపనీ సూచిస్తూ ఏనుగు మేత ఏనుగు మోత అనే లోకోక్తి ఏర్పడింది. ఆధిక్యానికి అల్పత్వానికి భేదాన్ని చెప్పడానికి హస్తిమశకాంతరం అనే జాతీయం వాడతారు. ఏనుగు పోతుంటే కుక్క మొరగడం అంటుంటారు. గొప్పవాణ్ని చూసి ఓర్వలేని అల్పుల ప్రవర్తనను ఉద్దేశించిన వ్యాఖ్య ఇది. కరిమింగిన వెలగపండు అనే జాతీయాన్ని సుమతీ శతకకారుడు ప్రయోగించాడు.ఏనుగు శరీర భాగాలూ విలువైనవే. ఒకప్పుడు ఏనుగు చచ్చీ వెయ్యి, బతికీ వెయ్యి అంటారు కదా. ఏనుగు జ్ఞాపకశక్తి అపారం. వివిధ వాసనల్ని మనుషుల స్వరాలను దశాబ్దాల పాటు గుర్తుంచుకోగలదు. ఉపకారులను, అపకారులను తేలికగా పసిగట్టగలదు.
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. -
పూరీ రథయాత్ర
పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.