నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం.
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. వృషభరాశిలోకి బృహస్పతి సంచారంవల్ల నర్మదానదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి.
మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఏకైక పుష్కర నది- నర్మద. మే 1 నుంచి 12 వరకు నర్మదానది పుష్కర సౌందర్యంతో విలసిల్లుతుంది. మత్స్య, కూర్మ, స్కాంద పురాణాలతోపాటు హరివంశం, రామాయణం, మహాభారతాల్లో నర్మదానది ప్రస్తావన ఉంది. స్కాంద పురాణంలోని రేవాఖండంలో నర్మదా వైభవం వర్ణితమైంది. భూలోకంలో తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు, మహర్షుల ప్రార్థన మేరకు, మహాదేవుడు జలరూపుడైన భవుడిగా సాకారమయ్యాడంటారు. ఆ భవుడు రుక్ష పర్వతంపై తాండవం చేసినప్పుడు శివ స్వేదం నుంచి నర్మద ఉత్పన్నమైందంటారు. తరుగుదల లేని జలసిరితో వర్ధిల్లమని నర్మదను ఆదిదేవుడు ఆశీర్వదించాడంటారు. అందుకే నర్మదను శివ పావనిగా జగద్గురు ఆదిశంకరులు నర్మదాష్టకంలో కీర్తించారు. గంగానదికి సాటిరాగల మేటినది అని నర్మదను భక్తతుకారం ప్రస్తుతించారు. కేవలం దర్శన మాత్రం చేతనే నర్మదవల్ల పుణ్యప్రాప్తి చేకూరుతుందని గోస్వామి తులసీదాసు పేర్కొన్నారు. పరమేశ్వరుడి ప్రియ పుత్రికగా నర్మదను శివనందిని అంటారు. మహావేగంగా ప్రవహించడం వల్ల మహతి, శబ్ద సమన్వితంగా ప్రవహిస్తుండటంవల్ల రేవా, నదీ గమనం శోభస్కరంగా ఉంటుంది కాబట్టి విమల, శుభగ, సమస్త సౌఖ్యాల్ని అందిస్తున్నందువల్ల కృపావాహిని, ధీరగంభీరంగా ప్రకటితం కావడంవల్ల మందాకిని- ఇలా ఎన్నో పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు. రంజన, అమృత, దశార్ణ, చిత్రోత్పల, శోణ, తమస- ఇలా అనేక పేర్లతో నర్మదను పురాణాలు వర్ణించాయి. తమ పితృ దేవతలకు మోక్ష సిద్ధిని కలిగించడానికి పురూరవ చక్రవర్తి కోరిక మేరకు శంకరుడు, నర్మదను భువికి పంపాడని కథనం. బాణాసురుడు, శివానుగ్రహం కోసం నర్మదానది తీరంలో తపస్సు చేశాడంటారు. ఆ అసురుడి తపస్సుకు మెచ్చి, నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో శిలారూపాలుగా వర్ధిల్లమని అతడికి మహేశ్వరుడు వరమిచ్చాడంటారు. ఈ నదీతీరంలో లభించే గుండ్రటి శిలల్ని, బాణుడి పేరిట, నర్మదా బాణశివలింగాలుగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో నర్మదా బాణలింగాలే పూజలందుకుంటున్నాయి.
నర్మదా నది పరీవాహక ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో, అనేక ఆలయాలతో తేజరిల్లుతోంది. వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తూ నర్మదా లోయలోకి అడుగిడే ఈ నది, మధ్యభారతానికి వరదాయినిగా వెల్లివిరుస్తోంది. ఈ నదీతీరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వరంతోపాటు అమరేశ్వరస్వామి సన్నిధి, రాజరాజేశ్వరుడు కొలువైన మహేశ్వర్, బేధాఘాట్, నరేశ్వర్, గరుడేశ్వర్ వంటి సన్నిధానాలు నెలకొని ఉన్నాయి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు. నర్మదానదీ తీరంలో ఎందరో తపోసిద్ధి పొందారంటారు. సప్తపుణ్యనదులలో ఒకటైన నర్మదానదీ తీరంలో షట్చక్రవర్తులలో ప్రసిద్ధుడైన మాంధాత, ఆదిశంకరులు వంటివారు తపస్సు చేసి ఈశ్వరకటాక్షాన్ని పొందారని పురాణాలు విశ్లేషించాయి. నర్మదానది భవ్య ఫలదాయిని- దివ్య శుభకారిణి.
డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు ప్రశ్నలు
శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమపురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి. -
విభూతి ధారణ
నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి. ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే. ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని. -
సత్యదేవ వైభవం
సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు. -
పోగొట్టుకున్న చోటే...
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. -
రాకపోకలు
జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. -
గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. -
దైవం ప్రసాదించిన దేహం
జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈది, కాటికి కాళ్లు జాపుకొన్నవాళ్లకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు... దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడపోసిన పెద్దలు. పసితనం నుంచి పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది. -
మన ప్రయాణం జ్ఞానం వైపు...
జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. -
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య.
తాజా వార్తలు (Latest News)
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
ఐపీఎల్ టాప్-2 జట్లలో వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేరా..!
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి