పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి.
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. దేని గురించి ఎంత మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడని వారంతా తెలివైనవాళ్లని అనలేం... కానీ, తెలివైనవాళ్లు మాత్రం ఎక్కువ శాతం మితభాషులుగానే ఉంటారు. ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది.
ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆలోచనలు మాటలుగా మారే దశలోనూ మన అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు. వాస్తవానికి చాలాసార్లు మన నోటికి, మాటకు మనపైనే అధికారం ఉంటుంది. ఏమి మాట్లాడబోతున్నామో తెలియక మాట్లాడిన తరవాత నాలుక కరుచుకుంటాం. ఒక్కోసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అన్నారు రమణ మహర్షి.
విజ్ఞుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. అయితే, మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకుని మరీ మాట్లాడుతుంటారు. యక్షుడు ధర్మరాజును మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుందని ప్రశ్నించాడు. ‘ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏమి మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో, ఇతరుల పట్ల అలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైతే జాగ్రత్తపడతారో వారికి సజ్జనత్వం సిద్ధిస్తుంది’ అన్నాడు ధర్మరాజు. సమాజంలో మాటకు ఒక విశిష్ట స్థానం ఉంది. సందర్భోచితమైన మాట మాత్రమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఇది ఎంత క్లుప్తంగా అర్థవంతంగా వినసొంపుగా ఉంటే అంత శక్తిమంతమవుతుంది. పరిధి దాటని మాట మానవ సంబంధాలను బలపరిస్తే, పరిధి దాటిన మాటలు క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేస్తాయి.
మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు. స్పందించాల్సిన సందర్భం కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు. మనసులో యోచన, మాటలో సూచన క్రియలో దక్షత- ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది. నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తగుదునమ్మా అంటూ వచ్చి తల దూరుస్తుంటారు. అడగకపోయినా అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. అధిక ప్రసంగ ధోరణి ఆత్మన్యూనతకు చిహ్నం. అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ధర్మమార్గం పట్ల గౌరవం, సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం, సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగే యుక్తి, సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి సర్వకార్యాలను సాధించగలడని ఒక సుభాషితం చెబుతోంది. స్నేహం వైరం నిర్మలత్వం కళంకం పుణ్యం పాపం ఔన్నత్యం నీచత్వం వంటివి మాటలను బట్టే వస్తాయి. సమయానికి తగినట్లు పొందికగా విజ్ఞతగా మాట్లాడాలని సనాతన ధర్మం హితవు పలికింది.
ఎం.వెంకటేశ్వరరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాకపోకలు
జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. -
గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. -
దైవం ప్రసాదించిన దేహం
జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈది, కాటికి కాళ్లు జాపుకొన్నవాళ్లకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు... దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడపోసిన పెద్దలు. పసితనం నుంచి పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది. -
మన ప్రయాణం జ్ఞానం వైపు...
జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. -
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో