శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు.
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. తన శాంతమే తనకు రక్ష అంటుంది సుమతీ శతకం. అంతులేని కోరికలతో అశాంతిని సృష్టించుకుంటాం. పేదవాడు ధనవంతుడు కావాలని తపన పడుతుంటాడు. ధనవంతుడు మరింత ధనం సంపాదించాలని శ్రమిస్తుంటాడు. కోటీశ్వరుడు పదవి కోసం పాకులాడుతుంటాడు. పంచేంద్రియాలు పనిచేస్తున్నంత కాలం మనిషిని అసంతృప్తి పీడిస్తుంటుంది. ఉన్నదానితో సంతృప్తి చెందక మరేదో కావాలని మనసు మారాం చేస్తుంటుంది. కోరికలు తీరనప్పుడు కోపం ప్రజ్వరిల్లుతుంది. అశాంతితో మనసు బరువెక్కుతుంది. అశాంతి అధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. కానిపనులు చేయిస్తుంది. మనిషిని పతనావస్థకు చేరుస్తుంది.
సత్వగుణ సంపన్నులకు శాంతమే భూషణమవుతుంది. భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు, విషాదకర వార్త విన్నప్పుడు మనిషి వేదనాభరితుడవుతాడు. బంధుమిత్రుల ఓదార్పు మాటలతో మనసు శాంతిస్తుంది.
చెడు ఆలోచనలను తొలగించి దుఃఖ కారణమైన పనులను నివారించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సదా సద్భావనలతో నిండిన మనసులో అశాంతికి తావుండదు. సమస్త ప్రాణులనూ ప్రేమించగలవారు మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు.
ఆకాశం, భూమి, అంతరిక్షం, ప్రవహించే నదులు, చెట్లు ప్రశాంతంగా ఉండి మనకు ప్రశాంతత నిచ్చు గాక... నిత్యం నాలుకపై ఉండే వాగ్దేవి ప్రశాంతంగా ఉండు గాక... పంచేంద్రియాలు ప్రశాంతంగా ఉండు గాక అన్నది శాంతి మంత్రం. మానసిక శారీరక ఒత్తిడులను తగ్గించుకుని ప్రశాంత జీవితం గడపాలని వేద ఉద్బోధ.
ధర్మరాజు రాజసూయ యాగం అత్యంత వైభవంగా పూర్తి చేయడం చూసి మయసభలో పరాభావం పొందిన దుర్యోధనుడి మనసులో అసూయ ప్రజ్వరిల్లింది. ఆ సమయంలో రారాజు మనసులో రేగిన అసూయ, క్రోధం కౌరవ వంశ వినాశనానికి దారితీశాయి. కామ క్రోధాలు, లోభమోహాలు, ఈర్ష్యాసూయలతో నిండిన చిత్తం అశాంతితో రగులుతూ ఉంటుంది.
హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వంవల్ల అతని మనసులో రోషం అనే అగ్ని భగభగ మండింది. తామస గుణం విజృంభించింది. హిరణ్యకశిపుడు ద్వేషించిన శ్రీహరే నరసింహస్వామిగా అవతరించి రాక్షసుణ్ని అంతమొందించాడు. క్రోధాన్ని శాంతంతో జయించాలని, శాంతి రూపమైన ఖడ్గం చేతిలో ఉన్నవాడిని దుష్టులు కూడా ఏమీ చేయజాలరని మహాభారతం చెబుతోంది.
ప్రశాంతనిలయమైన ఆలయంలో భగవంతుణ్ని స్మరిస్తున్నప్పుడు మనసులో ఆందోళన మాయమవుతుంది. భక్తిరస ప్రధానమైన గ్రంథ పఠనంతో మనిషి ప్రశాంత చిత్తుడవుతాడు. మనోహరమైన వనాలలో విహరిస్తున్నప్పుడు మనసు ఉత్సాహభరితమవుతుంది. ఆహ్లాద భరితమైన సుస్వర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనిషి ఆనందంతో పరవశిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆత్మీయులను ప్రేమగా ఆదరించడం, దాన ధర్మాల వంటి సత్కర్మలవల్ల అపూర్వ శాంతి లభిస్తుంది. పరమేశ్వరుణ్ని శరణు జొచ్చినవారు ఆయన కృపతో పరమ శాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందగలరని భగవంతుడి గీతాబోధ.
ఇంద్రగంటి నరసింహ మూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యదేవ వైభవం
సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు. -
పోగొట్టుకున్న చోటే...
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. -
రాకపోకలు
జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. -
గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. -
దైవం ప్రసాదించిన దేహం
జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈది, కాటికి కాళ్లు జాపుకొన్నవాళ్లకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు... దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడపోసిన పెద్దలు. పసితనం నుంచి పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది. -
మన ప్రయాణం జ్ఞానం వైపు...
జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. -
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్