పోగొట్టుకున్న చోటే...
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు.
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. ‘బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది... ఎంత వెతికినా దొరకడం లేదు’ అన్నాడు. కొద్దిసేపు యువకుడు కూడా వెతికాడు కానీ కనిపించలేదు. ‘తాతా ఎక్కడ పడింది?’ అని మళ్ళీ అడిగాడు. దూరంగా చేయి చూపిస్తూ- ‘అదిగో అక్కడ పడిపోయింది’ అన్నాడు. ‘అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా’ అన్నాడు. ‘అక్కడ అంతా చీకటి... ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది... అందుకే ఇక్కడ వెతుకుతున్నా’ అన్నాడు వృద్ధుడు. ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు కాని, చాలామందికి ఏదో సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాలను మరెక్కడో వెతుక్కుంటారు.
మనిషి ఆశాజీవి. మంచి భవిష్యత్తుకోసం ఎన్నో కలలు కనడం సహజం. కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. ఇతరులు స్వయంకృతమని నిందిస్తారు. తల్లిదండ్రులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఆందోళన, మానసిక ఒత్తిడి ఎక్కువై మనిషి తీవ్ర నిరాశకు లోనవుతాడు. తమ బాధ్యత మరిచిపోయి పెడదారులు పడతారు. తాము పోగొట్టుకున్న లోటు తోటివారికి తెలియకుండా ధైర్యం వహించి, ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి, తిరిగి శాంతిని పొందేవారు ధీరులని భర్తృహరి సుభాషితం చెబుతుంది. ఏది కోల్పోతారో అదే పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని సాధించవచ్చు. మనం పోగొట్టుకున్న శాంతి ఇతరులకు శాపం కాకూడదు. పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవిర్భవించేలా ప్రయత్నం సాగించాలి.
కురుక్షేత్ర సంగ్రామం రెండు కుటుంబాల మధ్య రాజ్యం కోసం జరిగింది. హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు. అది కురురాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్నివిధాలా అర్హుడైన పాండురాజు చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదలి ఆశ్రమవాసం చేయడంతో ధృతరాష్ట్రుణ్ని రాజును చేశారు. అహంకారంతో దుర్యోధనుడు, పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగపట్టారు.
అర్జునుడు రాజసూయ యాగం నిర్వహణ ధనం కోసం మాత్రమే ఇతర రాజుల మీద దండయాత్ర చేశాడు. ఎవరి రాజ్యాన్నీ ఆక్రమించలేదు. తమ రాజ్యాన్ని కౌరవులు మాయా జూదంలో గెలిచారు. గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు. అహంకారంతో అంగీకరించని కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. తాము వంచనకు గురై పోగొట్టుకున్న కురురాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. ఎక్కడ, ఏది తాము కోల్పోయారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు. తాము అవమానం పొందినచోటే సత్కారం పొందారు.
శిశిరంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా మారుతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది. ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటూ, కొత్తవి సంతరించుకుంటూ సాగుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసిపట్టి జీవనం గడపడమే సమగ్రమైన జీవితం.
రావులపాటి వెంకట రామారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసుకు కళ్లెం
మనసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది. -
మార్గాన్వేషణ
ఆధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది. -
పంచ సరోవరాలు
తీర్థం అంటే నీరు. నది, సరస్సు అనే అర్థాలూ ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. -
సత్య దర్శనం
జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ. -
నిష్క్రమణ
-
కీలుబొమ్మ
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు. -
ఆత్మనివేదనం
తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. -
జ్యేష్ఠం - ఎంతో శ్రేష్ఠం
జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. -
వేదాంగాలు
ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు. -
వెనక్కి నడుస్తున్నాం!
జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. -
పంజరంలో చిలుక
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. -
మనస్సాక్షి
ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. -
విశ్వమంత వెలుగు!
పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి. -
ఊహలు - వాస్తవాలు
ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. -
ఆంజనేయం... మహావీరం!
శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు. -
మాటతో... చూపుతో...
రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- ‘నేడు పోయి రేపు రా’ అని. ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. -
తమసోమా జ్యోతిర్గమయ
ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూరమృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దారికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది. తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి... -
మబ్బులతో ముచ్చట్లు
మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది. పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు. -
విన్నపాలు వినవలె...
లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. -
మోక్షదాయక నగరాలు
గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు ఏడు. అవి- అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య కోసలరాజ్యానికి రాజధాని. సాకేతపురమనీ పిలుస్తారు. భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
-
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
-
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
-
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!