ఏడు ప్రశ్నలు
శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమపురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి.
శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమపురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి. పురుషోత్తముడు శ్రీరాముడి వ్యక్తిత్వం, నడవడి, గుణప్రభావ విశేషాలు సర్వజనామోదంగా ఆవిష్కరించేందుకు ఎందరో కవులు గ్రంథరూపంలో రామాయణ మహా కావ్యాన్ని మనకు ప్రసాదించారు. రామభక్తుడైన గోస్వామి తులసీదాస్ మానస సరోవరంలో రామచరితం అనే అపూర్వ పద్మం వికసించింది. మానవజన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరిస్తూ తన సుగంధ సౌరభాన్ని లోకమంతా విరజిమ్ముతూ హృదయోల్లాసాన్ని కలిగించింది ఆ రచన. అవధి భాషలో సరళంగా, సుందరంగా వెలువడిన గ్రంథమది. శ్రీరాముడి గార్హస్త్య జీవనం, రాజధర్మం, భక్తి జ్ఞాన త్యాగ వైరాగ్య సదాచారాలు, ఉపదేశాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు గోస్వామి.
ఈ కథా ప్రబంధంలో ఇంకా పితాపుత్ర సంబంధాలు, దంపతుల అన్యోన్యానురాగాలు, సోదరుల సౌహార్దాలు, స్త్రీ పురుష మర్యాదాజీవనం, మన్నన, ప్రభువు ప్రజానురాగాలు, పాలకుల పట్ల ప్రజల భక్తి విశ్వాసాలను హృదయాన్ని తాకేలా పొందుపరచాడు. ఏ కాలంలోనైనా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి, పరస్పర స్నేహ సహకారాలతో వర్ధిల్లడానికి రామచరిత మానస గ్రంథ అనుశీలన అవసరమంటారు విజ్ఞలు.
మహాశక్తిమంతుడైన తన ప్రభువు శ్రీహరి శ్రీరాముడిగాను, మహా శేషుడు అపూర్వ పరాక్రమవంతుడు లక్ష్మణుడిగాను దుష్టశిక్షణకు భూమిపై అవతరించారని విని పొంగిపోయాడు గరుత్మంతుడు. రణభూమిలో మాయా యుద్ధంలో మేఘనాథుడి అస్త్రానికి మూర్ఛిల్లిన లక్ష్మణుణ్ని, తమ్ముడి కోసం దుఃఖించిన రాముడి బాధను జీర్ణించుకోలేకపోయాడు వైనతేయుడు. బ్రహ్మ, శివులను దర్శించి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. రామభక్తి సామ్రాజ్య సంద్రంలో మునకలు వేస్తున్న కాకభుశుండి అనే వాయసం నీ సందేహం తీర్చగలదని వారు గరుడుణ్ని అతడి చెంతకు పంపారు. అత్యంత శక్తిమంతుడైనా మానవుడిగా జన్మించిన శ్రీరాముడు సాధారణ వ్యక్తిలా కష్ట్టనష్టాల పాలైన స్థితిగతుల్ని, ధైర్య స్థైర్యాలను కోల్పోక వాటిని ఎదుర్కొన్న రాముడి శక్తిని, గాఢంగా నమ్మిన మిత్రులకు అందించిన ఆపన్న హస్తాన్ని, రాముడి శరణాగతి తత్త్వాన్ని వివరించి గరుడుడికి సందేహ నివృత్తి చేస్తాడు కాకభుశుండి.
గరుడుడి ఏడు ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానాలు అందిస్తాడు. దుర్లభమైన జన్మ ఏదని అడిగిన మొదటి ప్రశ్నకు మానవజన్మకు మించిన జన్మ మరొకటి లేదంటాడు. పరోపకారం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని, వినియోగించుకోలేని జన్మ వ్యర్థమని వివరిస్తాడు. ఘోరమైన దుఃఖమేది అన్న ప్రశ్నకు కోరుకున్నది లభించలేదని వగచే జీవితమేనని, సంపద లభించిన తరవాత దాన్ని పరులకు వితరణ చేయని జన్మ పరమ దుఃఖమని చెబుతాడు. గొప్ప సుఖమేదన్న మూడో ప్రశ్నకు సత్సాంగత్యమే నిజమైన సుఖమంటాడు. సజ్జన దుర్జన స్వభావాల గురించిన మరో ప్రశ్నకు మానవసేవ దైవాన్ని దగ్గర చేసే మార్గమని, సజ్జనులు మర్రి వృక్షంలా తమ నీడలో ఆర్తులకు ఆశ్రయం కలిగించాలని చెబుతాడు. ఇతరులకు హాని కలిగించే దుర్జనులకు దూరం కావడమే సజ్జన లక్షణమని తేటతెల్లం చేస్తాడు. శ్రుతుల్లో చెప్పిన పుణ్యకార్యమేదన్న అయిదో ప్రశ్నకు అహింసను మించిన పరమధర్మం మరొకటి లేదని బోధిస్తాడు. భయంకరమైన పాపకార్యమేదన్న ప్రశ్నకు పరనిందేనని, అది నరకానికి దగ్గరి దారి అంటాడు వాయసరాజు. మానసిక జాడ్యాలేమిటన్న చివరి ప్రశ్నకు మోహమే సమస్త రోగాలకు మూలమని చెబుతాడు. వైరాగ్య భావనతో ఉత్తమ బుద్ధిని అలవరచుకొని విషయవాంఛలకు దూరంగా నిర్మలచిత్తంతో జీవనం సాగించడమే మనిషి ధర్మం అన్న కాకభుశుండి మాటలు ముత్యాల మూటలు.
మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మౌనం మధురం
మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణశక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. -
దాన విధానం
చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు. భూమ్మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి. ధర్మాచరణమే పుణ్యకార్యం. సత్యం, శుచిత్వం, దయ, దానం అనే నాలుగూ ధర్మదేవతకు నాలుగు పాదాలని సంప్రదాయ భావన. -
విద్యా వినయ సంపన్నత
మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. -
పలుకుతేనెలు
మానవులందరూ మాట్లాడతారు. కాని, అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి. కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి. కొందరి మాటలు తేనెలొలుకుతాయి. -
కష్టేఫలే
ఈ సృష్టిలో గ్రీష్మరుతువు, వర్షరుతువు ఎలాగైతే ఒకదాని తరవాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోను కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కాని కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టులేదు. కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. -
జీవిత సాక్షాత్కారం
చెట్టు జీవిస్తోంది. పక్షి జీవిస్తోంది. పాము జీవిస్తోంది. ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపజేస్తోంది. జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే. ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద. జీవనసారం తెలుసుకుని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు. -
బోనం... భాగ్యం!
ప్రశస్తమైన ప్రకృతి సకల శక్తులకు ఆలంబన. ప్రకృతి నుంచే సమస్త చైతన్యం ఉత్పన్నమవుతుంది. ఆ చైతన్యశక్తిని ఆర్ష ధర్మం పలు రూపాల్లో దర్శిస్తోంది. శక్తి లేనిదే సృష్టి మనుగడ లేదు. శక్తి నిత్యత్వం ప్రకృతికి సర్వదా నూతనత్వాన్ని ఆపాదిస్తోంది. అందుకే ప్రకృతిని పరమాత్మ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. -
లోకప్రియం
ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. మనుషులకే కాకుండా పశువులు, పక్షులు, వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయిని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది. వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఃఖాల అనుభూతి చెందుతాయని జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. -
ధన్య జీవితం
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. -
ధర్మ పోరాటం
ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మ సమ్మతంగా పోరాడితే అది సముచితమైందిగా హదీసులు వివరిస్తున్నాయి. అన్యాయానికి తోడ్పాటునందిస్తే అది ఆత్మహత్యా సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నా వారు నా వారే అనుకుంటే అది దురభిమానమవుతుంది. -
శుభ ఏకాదశి
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి, దశమి, ఏకాదశి... వంటి మంచి రోజులను ఎంచుకోవడం చాలామందికి అలవాటు. -
మహోన్నతం
మనిషికి భగవంతుడిచ్చిన వరం- మాట. మాట్లాడే శక్తి మనిషికే ఉంది. అయితే అయినదానికి, కానిదానికి మాట్లాడవలసిన అవసరంలేదు. -
హారతి
శాస్త్రోక్తంగా చేసే పూజ- పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. -
నాలుగు మంచి మాటలు
మైత్రి, కరుణ, ముదిత (సానుకూల మానసిక స్థితి), ఉపేక్ష అనే నాలుగు సాధనాలతో జీవితాన్ని చింతనా రహితంగా అలంకరించుకోవచ్చు. ఈ నాలుగు భావనలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. -
ఆధ్యాత్మిక సాధన
ఇహలోక బంధాల నుంచి విముక్తి కలిగించి, పారలౌకిక మార్గమేదో తెలిపి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియనే సాధన అంటారు. ధ్యానం, జపం, నామస్మరణ మొదలైన క్రియలతో చిత్తవృత్తుల పరుగులకు కళ్ళెం వేయడానికి చేసే ప్రయత్నమే సాధన. -
అదృష్టం - దురదృష్టం
మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. -
కష్టం-సుఖం
తన జీవితం సమస్యా రహితంగా, సుఖంగా సాగాలని ప్రతీ మనిషికి ఉండటం సమంజసమే. కాని తనకే ఏ సమస్యా రాకూడదు, తాను సుఖంగా బతికితే చాలు అనుకోవడం అనేక కష్టాలకు మూలం అవుతుంది. -
వెలుగు నుంచి చీకటికి...
కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. -
అన్నమహిమ
అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. -
పూరీ రథయాత్ర
పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్