ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
ప్రతి మనిషికీ జన్మించినప్పటి నుంచి మరణించే దాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటిది. ఇవ్వడం... తీసుకోవడం. కణాలను, శరీరాన్ని, మనసును... ప్రతి దాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది.
ప్రతి మనిషికీ జన్మించినప్పటి నుంచి మరణించే దాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటిది. ఇవ్వడం... తీసుకోవడం. కణాలను, శరీరాన్ని, మనసును... ప్రతి దాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది.
మరణం అనేది మానవ శరీరం తాలూకు అన్ని ప్రకంపనల సంపూర్ణ ముగింపు. గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఊపిరితిత్తులు, సిరలు, ధమనులు... నిజానికి భౌతిక శరీరంలోని ప్రతి అవయవం పనిచేయడం, కంపించడం నిలిచిపోతాయి. ఇంద్రియజ్ఞానం పోతుంది. లోపలకు, బయటకు తీసుకెళ్ళేందుకు పనిచేసే నాడులు ఉత్తర్వులు అందుకోవడం మానేస్తాయి. ఆ రకమైన విరామమే- మరణం.
శ్వాసక్రియలో గాలి పీల్చిన తరవాత వెంటనే విడవడం ఉండదు. శ్వాసను కొంతసేపు లోపల ఉంచుతాం. ఆ తరవాత ఊపిరి పీల్చుకుంటాం. అలాగే మళ్ళీ గాలి విడిచిపెట్టాక... రెండు సందర్భాల్లోనూ చిన్న విరామం ఉంటుంది. మొదటి విరామం ఉచ్ఛ్వాసం(పూర్ణకుంభకం). రెండో విరామం నిశ్వాసం(శూన్య కుంభకం). ఈ విరామ స్థితులు వేగానికి సంబంధించినవి కావు. విరామ స్థితి మరణ స్థితే తప్ప మరొకటి కాదు. ఆ స్థితిలో ప్రతి చర్యా, ప్రతి కంపనం నిలిచిపోతాయి.
మృత్యువు అని దేన్ని అంటాం? శ్వాస విడుదలైన తరవాత ఒక సెకనుకు బదులుగా ఒక ఏడాది, నెల, లేదా ఒక రోజు లేదా సుదీర్ఘ విరామం తరవాత తిరిగి రావడం... ఇదే తేడా. మరణం అంటే ఒక రకమైన మార్పు. ఇంద్రియాల బహిర్ముఖ చలనం ద్వారా మనం మార్పుచెందే ప్రపంచాన్ని మాత్రమే గ్రహిస్తాం. మార్పులేని, అజరామరమైన వాటిని గ్రహించాలనుకునేవారు ఈ మార్పు పవనాలను అధిగమించాలి. ఆ అస్తిత్వమే దైవం.
అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ ఆఖరికి ఇంటికెళ్ళే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద... ఏవీ మరణం నుంచి కాపాడలేవని స్పష్టమైపోయింది.
తన శవ పేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్ళేదారిలో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలను పరచాలని, శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటకు కనిపించే విధంగా ఉంచాలనే మూడు కోరికలూ వెల్లడించాడు తన ప్రీతిపాత్రుడైన సైనికుడికి.
ఆ కోరికల వెనక ఆంతర్యమడిగాడతడు. నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే! అందుకనే మొదటి కోరిక కోరానన్నాడు. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేదీ తన వెంట తీసుకెళ్ళలేకపోతున్నానని, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికి రెండో కోరిక. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను... వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే మూడో కోరిక అని చెప్పి కళ్లు మూశాడు.
ఎందరెందరో జీవిస్తున్నారు. అయితే పొందిన జీవితానికి కొంతైనా జోడించాలి మనిషి. ప్రతి మనిషీ ఎంతో అవగాహనతో జీవించాలి. దైవం మనిషికి ఈ ఉనికిలో ఒక బాధ్యతను అప్పగించాడు. అది- మానవస్పృహను పెంపొందించే దిశలో కృషి చేయడం. ప్రతి ఒక్కరూ ఆ పాత్రను నూరుశాతం పోషిస్తే దైవం కార్యం చేస్తున్నట్లే.
మంత్రవాది మహేశ్వర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం కలిసి రావాలి...
చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి. -
మనసుకు కళ్లెం
మనసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది. -
మార్గాన్వేషణ
ఆధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది. -
పంచ సరోవరాలు
తీర్థం అంటే నీరు. నది, సరస్సు అనే అర్థాలూ ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. -
సత్య దర్శనం
జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ. -
నిష్క్రమణ
-
కీలుబొమ్మ
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు. -
ఆత్మనివేదనం
తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. -
జ్యేష్ఠం - ఎంతో శ్రేష్ఠం
జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. -
వేదాంగాలు
ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు. -
వెనక్కి నడుస్తున్నాం!
జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. -
పంజరంలో చిలుక
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. -
మనస్సాక్షి
ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. -
విశ్వమంత వెలుగు!
పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి. -
ఊహలు - వాస్తవాలు
ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. -
ఆంజనేయం... మహావీరం!
శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు. -
మాటతో... చూపుతో...
రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- ‘నేడు పోయి రేపు రా’ అని. ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. -
తమసోమా జ్యోతిర్గమయ
ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూరమృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దారికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది. తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి... -
మబ్బులతో ముచ్చట్లు
మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది. పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు. -
విన్నపాలు వినవలె...
లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు.
తాజా వార్తలు (Latest News)
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్