దేవుడి కోరికలు
మనుషులకు కోరికలుంటాయి. వాటిని భగవంతుడు తీరుస్తాడు. మరి దేవుడి కోరికల మాటేమిటి? వరాలిచ్చేవాడికి కోరికలుండటమా? అఖిల సృష్టికీ రక్షణ కల్పించేవాడికి కూడా కోరికలుంటే... వాటిని తీర్చేదెవరు? ఎవరికి సాధ్యం? సహజంగానే ఈ సందేహం ఉత్పన్నమవుతుంది.
మనుషులకు కోరికలుంటాయి. వాటిని భగవంతుడు తీరుస్తాడు. మరి దేవుడి కోరికల మాటేమిటి? వరాలిచ్చేవాడికి కోరికలుండటమా? అఖిల సృష్టికీ రక్షణ కల్పించేవాడికి కూడా కోరికలుంటే... వాటిని తీర్చేదెవరు? ఎవరికి సాధ్యం? సహజంగానే ఈ సందేహం ఉత్పన్నమవుతుంది.
మనం కోరే కోరికలన్నీ సుఖసంతోషాల కోసమే. మన శ్రేయస్సు కోసమే. ఇది అక్షర సత్యం. మరి, పరమాత్మ కోరేదేమిటి? ఎవరిని కోరుతున్నాడు, ఏమని కోరుతున్నాడు? ఆయన కోరికలూ మన కోసమే. మన భవిత కోసమే. లోకకల్యాణం కోసమే. అవి కోరికలు కావు. సలహాలు, సూచనలు, బోధనలు, ఉపదేశాలు. వాటిని మనం శిరోధార్యంగా భావించాలి. అవగాహన చేసుకోవాలి. అనుసరించాలి. ఆచరించాలి. అప్పుడే జన్మ చరితార్థమవుతుంది.
దైవం ప్రధానంగా కోరేదేమంటే- మనం నిరంతరం ధర్మవర్తనులమై ప్రయాణించాలని! ధర్మాచరణకు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. మంచిని కనమన్నాడు, మంచిని వినమన్నాడు, మంచి చేయమన్నాడు. ‘ఆపన్నుల సేవే అంతర్యామి సేవ’ అన్నాడు. జీవితమనేది ఓ అద్భుతమనుకుంటే, జీవన విధానం మరీ అద్భుతమైంది. అమూల్యమైంది. దేవుడిచ్చిందే ఇది. ఇచ్చినందుకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటి ద్వారా పరమేశ్వరుడు మహత్తరమైన సందేశాలందించాడు. రుషులు, యోగులు, అవధూతలు మొదలైన మహానుభావుల ద్వారా స్వామి అద్భుతమైన ప్రవచనాలందించాడు. సావధానంగా అన్నీ చదివి, లేదా విని జీవిత మకరందంతో సమన్వయం చేసుకుని భవిష్యత్తును మహోజ్జ్వలం చేసుకొమ్మన్నాడు. పత్రం, పుష్పం, ఫలం, జలం- ఏది సమర్పించాలనుకున్నా చిత్తశుద్ధి, నిర్మల భక్తి, ఏకాగ్రత ఉంటే చాలన్నాడు వాసుదేవుడు. ఇదేమైనా పెద్ద కోరికా? ఈ మాత్రం మనం తీర్చలేమా? అదీ మనకోసమేగా!
నోమో, వ్రతమో, తీర్థయాత్రో, దేవాలయ దర్శనమో, మౌనమో, ధ్యానమో- ఏదైనా మన మనశ్శాంతికే, ఆత్మజ్ఞాన ప్రాప్తికే, మనోవికారాలను తగ్గించుకోవడానికే! అపరాధాలు, నేరాలు, పాపాలు చేస్తే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిండు మనసుతో పశ్చాత్తాపం ప్రకటించుకోగలిగే ధైర్యం, విజ్ఞత ఉంటే చాలు మనకు. ‘నువ్వు చేయదలచుకున్నది పెన్సిల్తో రాసి, రబ్బరు నా చేతికివ్వు’ అన్నాడంటే- అంతటి వాత్సల్యమూర్తి లోకంలో మనకు మరొకరు కనిపిస్తారా? ‘లోచూపు ఉంటే నన్ను ప్రత్యక్షంగా చూడగలవు’- అన్నాడు ఆపద్బంధువు. కష్టాలు, కన్నీళ్లు, విరహాలు, వియోగాలు, అవమానాలు- అన్నీ భరించాడు శ్రీరాముడై. ఎన్ని భరించినా ఆత్మన్యూనత పొందరాదని, ఆత్మవిశ్వాసం కోల్పోరాదని, ధర్మమార్గం తప్పి చరించరాదని, సహనం కోల్పోరాదని ఆచరించి లోకానికి తెలియజేశాడు మర్యాదా పురుషోత్తముడు.
నీతోనే, నీలోనే ఉన్నానని నీరజాక్షుడు చెబుతున్నా- ఆ మాటలు వినే ఓపిక, తీరిక మనకు లేకపోతే ఎలా? కామకోటి రాస్తున్నవాడికి రామకోటి రాయాలన్న సత్సంకల్పం కలుగుతుందా! మన కోరిక ధర్మబద్ధమైతే ఎంత అసాధ్యమైనా సుసాధ్యమై తీరుతుంది. ధర్మబద్ధం కాకపోతే సులభ సాధ్యమైనదైనా తీరదు. ‘మంచినే కోరు’ అనేదే ఆయన కోరిక. అదే మనకు కరదీపిక!
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం కలిసి రావాలి...
చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి. -
మనసుకు కళ్లెం
మనసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది. -
మార్గాన్వేషణ
ఆధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది. -
పంచ సరోవరాలు
తీర్థం అంటే నీరు. నది, సరస్సు అనే అర్థాలూ ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. -
సత్య దర్శనం
జీవితాన్ని ఉత్సాహభరితంగా ఆస్వాదించాలి. వర్తమానంలో ప్రతి క్షణాన్ని మరలా తిరిగి రాదనే ఎరుకతో చిరస్మరణీయంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. సమాజం పట్ల చూపించే కృతజ్ఞత ఆప్యాయతలే మనం సంపాదించుకునే నిజమైన ఆస్తులు ఆప్తులు అన్న భావన గొప్ప స్పృహ. -
నిష్క్రమణ
-
కీలుబొమ్మ
అలవాటైన పనులు యాంత్రికంగా సాగుతుంటాయి. యంత్రాలు చేసే పనులు మరింత యాంత్రికంగా ఉంటాయి. యంత్రం మనిషి జీవనంలో ప్రవేశించిన తరవాత మనిషి సున్నిత భావాలు తగ్గిపోయాయి. యంత్రం పని చేస్తుంది. యంత్రాన్ని పని చేయించేవాడు మనిషే. యంత్రం మూలాన మనిషి కనబడకుండా పోతున్నాడు. -
ఆత్మనివేదనం
తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతణ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. -
జ్యేష్ఠం - ఎంతో శ్రేష్ఠం
జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. -
వేదాంగాలు
ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు. -
వెనక్కి నడుస్తున్నాం!
జ్ఞానం వెనక అజ్ఞానం, తెలివి వెనక అమాయకత్వం, ధైర్యం వెనక భయం మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘసామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. -
పంజరంలో చిలుక
జీవుడూ బ్రహ్మమేనని, బ్రహ్మకంటే వేరుకాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకలా, రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. -
మనస్సాక్షి
ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. -
విశ్వమంత వెలుగు!
పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి. -
ఊహలు - వాస్తవాలు
ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. -
ఆంజనేయం... మహావీరం!
శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు- ఆంజనేయుడు. హనుమను ‘సర్వదేవాత్మకుడు’ అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ‘అంజన’గా వ్యవహరిస్తారు. -
మాటతో... చూపుతో...
రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- ‘నేడు పోయి రేపు రా’ అని. ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. -
తమసోమా జ్యోతిర్గమయ
ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూరమృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దారికోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది. తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి... -
మబ్బులతో ముచ్చట్లు
మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది. పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు. -
విన్నపాలు వినవలె...
లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు.
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా