Ring Nets: నడి సంద్రంలో వలల నిప్పు
కొందరు మత్స్యకారులు రింగ్ వలలతో వేట సాగిస్తుండగా... మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. కొందరికి గాయాలు కాగా ఆరు పడవలు దహనమయ్యాయి.
మత్స్యకారుల మధ్య ఘర్షణలు
సాగరంలో ఆరు పడవల దహనం
విశాఖ తీరం సహా పలు గ్రామాల్లో ఉద్రిక్తత
ఈనాడు, విశాఖపట్నం, ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, గ్రామీణ భీమిలి, న్యూస్టుడే: కొందరు మత్స్యకారులు రింగ్ వలలతో వేట సాగిస్తుండగా... మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. కొందరికి గాయాలు కాగా ఆరు పడవలు దహనమయ్యాయి. ఫలితంగా విశాఖ సాగరతీరంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీసంఖ్యలో బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తీరానికి సమీపంలో ‘రింగ్ వలలు’ వినియోగిస్తే సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందనే అంశంపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మత్స్యకారులు పడవలపై రింగ్ వలలతో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. సమాచారం అందుకున్న పెదజాలరిపేటకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు వారి వేటను అడ్డుకునేందుకు పెద్దసంఖ్యలో పడవలపై బయలుదేరారు. మంగమారిపేట తీరంలో సముద్రంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు, రింగ్ వలలతో వేట సాగిస్తున్న వారు కొందరు గాయపడ్డారు. గాయపడిన మత్స్యకారులు పెదజాలరిపేటకు వచ్చి తమ ప్రాంతంలోని వారికి సమాచారం అందించారు. ప్రతిదాడి చేయడానికి పెదజాలరిపేట వాసులు భారీసంఖ్యలో సమీపంలోని వాసవానిపాలెం, జాలరిఎండాడలకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. మత్స్యకారులను నిలువరించేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. చివరికి వారిని వెనక్కి పంపేయడంతో వివాదం కొంత సద్దుమణిగింది.
పడవల దహనంతో...
ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు సాగుతున్న సమయంలో మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన వారి పడవలను కొందరు తమతో పాటు తీసుకువెళ్లి జాలరిపేట తీరంలో దహనం చేశారు. నాలుగు పడవలు పూర్తిగా, రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామాల వాసులు సాగరం ఒడ్డున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకుని శాంతింపచేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను మరో గ్రామానికి చెందిన వారు బంధించడం కలకలం రేపింది. పోలీసులు ఆ ఇద్దరినీ విడిపించారు. సముద్రంలో పడవలు దహనమవడం, మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తటంతో నౌకాదళం, కోస్టుగార్డు, మెరైన్ విభాగ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నౌకాదళ సిబ్బంది హెలికాప్టర్తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మంత్రి, సీపీ పర్యవేక్షణ...
మత్స్యకార గ్రామాల్లో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి, 144 సెక్షన్ విధించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్ మనీష్కుమార్ సిన్హా, డీసీపీ గౌతమి శాలి, ఏడీసీపీలు శ్రావణ్కుమార్, ఆనందరెడ్డి, పలువురు ఏసీపీలు తీరంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. మత్స్యకారులతో మాట్లాడారు. వివాదాలకతీతంగా మసలుకోవాలన్నారు.
రింగు వల అంటే ఏమిటి?
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సాధారణంగా గిల్, రింగు వలల్ని ఉపయోగిస్తారు. రింగు వల కన్ను వృత్తాకారంలో ఉంటుంది. దీని ఖరీదు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. ఈ వలలో చిన్నచిన్న చేపలూ చిక్కుతాయి. కాబట్టి పెద్దమొత్తంలో పట్టుకునే అవకాశం ఉంది. తీరం నుంచి 8 కిలోమీటర్లలోపు దీన్ని ఉపయోగిస్తుండటంతో గిల్ వలలతో వేటను సాగించే సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరక్క నష్టం కలుగుతోంది. ఈ కారణంగా 8 కి.మీ.లోపు రింగు వలల వినియోగాన్ని నిషేధించారు.
* గిల్ వల: ఈ వలకు చతురస్రాకారంలో కన్ను ఉంటుంది. దీని ఖరీదు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. ఈ వలల్ని వాడే మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. ఈ వలకు పెద్ద చేపలు చిక్కి, చిన్న చేపలు జారి పోతాయి. రింగు వలతో పోలిస్తే దీనిలో తక్కువ చేపలు పడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. -
ఓటెత్తిన ‘ప్రజా’స్వామ్యం
రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ వైకాపా విధ్వంసకాండ
ఏజెంట్లను భయపెట్టారు.. కూర్చుంటే తలకాయలే ఉండవని హూంకరించారు.. సాయంత్రం తిరిగి ఇళ్లకూ వెళ్లరని హెచ్చరించారు.. రేపటి నుంచి ఊళ్లలో తిరగలేరని బెదిరించారు. పోలీసులు ఉన్నా బెదరకుండా కిరాతకంగా వ్యవహరించారు. -
ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు
ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అంతే తప్ప, ఇష్టారాజ్యంగా లోపలకు వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో.. నిబంధనలు పాటించాలని తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అడగడమే ఆ ఓటరు తప్పయిపోయింది. -
మాచర్లలో రక్తం పారాల్సిందే..!
ఆటవిక పాలనను మించిన అరాచకాలకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధమైన వేళ.. అరాచకశక్తులు మరింతగా పేట్రేగిపోయాయి. ఐదేళ్లుగా నమ్ముకున్న దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు, హింసనే ఎన్నికల రోజున ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. -
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు
రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద అంగన్వాడీల ఆట సాయం
చిత్తూరు నగరంలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు అనేక మంది మహిళలు తమ చిన్నారులతో పోలింగ్ కేంద్రాలకు సోమవారం చేరుకున్నారు. -
ఓటేశాం.. వెళ్లొస్తాం!.. తెలంగాణ బాటపట్టిన ప్రజలు
సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. -
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
ఓ వైపు భర్త మృతిచెందినా.. తనలోని బాధను దిగమింగుకుని ఓటుపై అవగాహన కలిగిన చిరుద్యోగిగా ఓ మహిళ తన ప్రాథమిక హక్కు వినియోగించుకున్నారు. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
సంకల్పం ముందు వైకల్యం ఎంత!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన సురేశ్.. తన 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. -
నది దాటారు.. ఓటేశారు..
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనదార గిరిజన గ్రామాల ప్రజలు నదిలో నుంచి కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ ఓటేసిన వృద్ధురాలు
ఓటు విలువ తెలియక కొందరు ఇళ్లకే పరిమితమవుతుంటే.. పుట్టెడు దుఃఖాన్ని భరించి 80 ఏళ్ల వృద్ధురాలు తన కర్తవ్యాన్ని చాటారు. -
రెండు రౌండ్ల కాల్పులు.. ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ భూమిలోకి రెండురౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆ ధాటికి రాళ్లు ఎగిరి తగలడంతో ముగ్గురు గాయపడ్డారు. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక