‘ఎయిమ్స్’కు చుక్కలు చూపిస్తున్నారు
పేదలకు ఉన్నత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రసంగాలు చేస్తుంటారు. విభజన అనంతరం రాష్ట్రంలో పెద్దాసుపత్రులు లేకుండా పోయాయని
సరిపడా నీటి సరఫరాకు ప్రభుత్వ కొర్రీలు
ఖర్చులు భరించాలని స్పష్టీకరణ
నీళ్లు లేకనే వైద్య సేవల విస్తరణకు ఆటంకం
కేంద్రం లేఖ రాసినా పట్టించుకోని రాష్ట్రం
ఈనాడు - అమరావతి
పేదలకు ఉన్నత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రసంగాలు చేస్తుంటారు. విభజన అనంతరం రాష్ట్రంలో పెద్దాసుపత్రులు లేకుండా పోయాయని తరచూ వాపోతుంటారు. ఆరోగ్యశ్రీని పక్కాగా అమలు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్నామని చెబుతుంటారు. కానీ... మంగళగిరిలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్కు దైనందిన అవసరాలకు తగినట్లుగా నీటిని అందించలేకపోతున్నారు. సరఫరా ఖర్చును భరించాలని కూరగాయల మాదిరిగా బేరాలు సాగిస్తూ ఆసుపత్రికి చుక్కలు చూపిస్తున్నారు. కాకినాడ నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల రోగులకు ఎంతగానో ఉపయోగపడే ఎయిమ్స్లో తగిన నీటి వసతి లేని కారణంగా ఇన్పేషంట్లను ఎక్కువ సంఖ్యలో చేర్చుకోలేని దుస్థితి నెలకొనడం విస్మయానికి గురిచేస్తోంది.
మంగళగిరిలో రూ.1,618 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణానికి 2015 డిసెంబరులో శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12 నుంచి సేవలు మొదలయ్యాయి. అత్యాధునిక నిర్మాణాలు, వసతులతో రూపుదిద్దుకుంటున్న ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి రోజుకు 15-20 లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం 2-3 లక్షల లీటర్లను మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఉచితంగా అందిస్తున్నారు. ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రికి తెచ్చేందుకు నెలకు రూ.5 లక్షల ఖర్చును ఎయిమ్స్ భరిస్తోంది. ఓపీ ద్వారా రోజూ 1,500 మంది వరకు వైద్యం పొందుతున్నారు. 950 వరకు ఇన్పేషంట్ పడకల ఏర్పాటుకు అవకాశముంది.
అయితే... 125 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణాలకు తగ్గట్లు 400 పడకలను అదనంగా వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఎంబీబీఎస్లోనూ సీట్లు పెరిగాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి పీజీ, నర్సింగ్లోనూ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా రోజు మరో 3 లక్షల లీటర్ల నీటిని అదనంగా ఇవ్వాలని ఎయిమ్స్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్ల స్థాయి వరకు కొద్దికాలంగా లేఖలు రాస్తూనే ఉన్నారు. అదనంగా 3 లక్షల లీటర్ల నీటిని మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వెలుపలి (విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) నుంచి ఇవ్వాల్సి ఉన్నందున చెల్లింపులు జరగాల్సిందేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తొలుత పేర్కొన్నట్లు రోజుకి రూ.72,162 కాకున్నా... కనీసం సాధారణ స్థాయిలోనైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం రోజుకి రూ.35వేల వరకు కార్పొరేషన్కు చెల్లించాల్సి వస్తుందని తెలిసింది. ఈలెక్కన చెల్లింపులు జరిపి, నీటిని మంగళగిరి ఎయిమ్స్కు ట్యాంకర్ల ద్వారా తెప్పించేందుకు నెలకు అదనంగా మరో రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
కేంద్ర మంత్రుల విస్మయం
రాష్ట్రానికి ఎయిమ్స్ వస్తుంటే... రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి.. అవసరమైన నీరు, రోడ్డు, ఇతర కనీస సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రులు భారతీ పవార్, నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎయిమ్స్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అదనంగా మరో 3 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా అందచేయాలి’ అని కేంద్ర మంత్రి మాండవీయ 2022 జులై 28న ముఖ్యమంత్రి జగన్కు స్వయంగా లేఖ రాశారు. అయితే... ‘ఉచితంగా నీటిని ఇవ్వలేం. ధర మాత్రం తగ్గిస్తాం’ అని 2022 సెప్టెంబరు 2న పురపాలకశాఖ చెప్పడం గమనార్హం.
ముచ్చటగా... 3 ప్రతిపాదనలు
ఎయిమ్స్కు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరిగితేనే సమస్య పరిష్కారమైనట్లు లెక్క. తెనాలి రోడ్డులోని మంగళగిరి ట్రీట్మెంట్ ప్లాంటు నుంచి నీరిచ్చేందుకు 2018లో తొలి ప్రతిపాదన చేశారు. భవిష్యత్తులో మంగళగిరికి నీటి సమస్య వస్తుందన్న అభ్యంతరాలతో అది మరుగునపడింది. ఉండవల్లి నుంచి తెనాలి వరకున్న పైపులైను నుంచి నీటిని తీసుకోవాలనే రెండో ప్రతిపాదన తెచ్చారు. స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనా కనుమరుగైంది. చివరికి... మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు సమీపంలోని 80 ఎకరాల చెరువు నుంచి నీటిని తరలించేందుకు టెండరు పిలిచారు. త్వరలో సంస్థను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ ప్రాంగణానికి వచ్చే మార్గంలో 0.42 హెక్టార్ల అటవీ భూమిని ఎయిమ్స్కు ఇంకా బదలాయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. -
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఎన్నికల నిఘా వేదిక పరిశీలకులు జీవీ కృష్ణారావు అన్నారు. -
ఆ 15 రోజులు ఎప్పటికి వచ్చేనో?
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమంటూ జగన్ డప్పు కొట్టుకుంటారు. తాను వచ్చాకే సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా బూరలు ఊదుతారు. -
ఉద్యాన రైతుకు.. ఉరి!
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. పూలు, పండ్లు, కూరగాయల సాగే లాభదాయకం అన్న భావన కలిగించింది. -
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
పేదల గొంతెండబెట్టిన జగన్!
జనానికి గుక్కెడు నీరిచ్చే.. జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులకూ సహకరించని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డే. -
ఈ చదువులు మాకొద్దు ‘మామా’
జగన్ పాలనలో యువత ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ చదువులు మాకొద్దంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం.. విద్యా సంస్థలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేయడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. -
ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయండి
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
సుప్రీంకూ అబద్ధాలేనా?
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తీరు. -
పోస్టల్ బ్యాలట్ను 12 వరకు పొడిగించాలి
పోస్టల్ బ్యాలట్ ప్రక్రియను ఈనెల 12 వరకు పొడిగించాలని సీఈవోను పలువురు తెదేపా నేతలు.. ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావులు.. ఐక్యవేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారు. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!