Financial literacy: ఆర్థిక.. అక్షరాస్యులమవుదాం!
కొత్త సంవత్సరం వచ్చేసింది. నిన్న ఏం చేశాం.., ఇప్పుడు ఏం చేద్దాం, చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటి? అనే ఆలోచన ఎంతోమందిలో మెదులుతుంది. చేయకూడనివి ఏమిటనేది కాసేపు పక్కనపెడితే, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందీ, తప్పనిసరిగా అనుసరించాల్సింది ఒకటుంది.
కొత్త సంవత్సరం వచ్చేసింది. నిన్న ఏం చేశాం.., ఇప్పుడు ఏం చేద్దాం, చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటి? అనే ఆలోచన ఎంతోమందిలో మెదులుతుంది. చేయకూడనివి ఏమిటనేది కాసేపు పక్కనపెడితే, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందీ, తప్పనిసరిగా అనుసరించాల్సింది ఒకటుంది. అదే కట్టుదిట్టమైన ఆర్థిక ప్రణాళిక.
పొదుపుతో పాటు మదుపు...
కేవలం పొదుపు చేస్తే సరిపోదు. మదుపు కూడా చేయాలి. 4+4= 8 మాత్రమే. అదే గుణిస్తే 16 అవుతుంది. అదే మదుపు అంటే! ఇందుకోసం బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్లు.. వంటి పెట్టుబడి సాధనాలను పరిశీలించాలి. ఎప్పుడు ఎక్కడ మదుపు చేయాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతాలో సొమ్ము ఉంటే వెంటనే స్పెషల్ డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ రేట్లు వచ్చే ఏడాది చివరి నాటికి మళ్లీ తగ్గిపోవచ్చు.
గత రెండేళ్లలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం వల్ల ఎంతోమంది ఆర్థికంగా కుంగిపోయారు. ఆ నష్టం నుంచి ఎన్నో కుటుంబాలు ఇంకా కోలుకోలేదు. ఈలోపే 2022లో ఉక్రెయిన్-రష్యా- యుద్ధం, ఆర్థిక మాంద్యం ఉరిమాయి. సంపన్నుల నుంచి సామాన్యుల దాకా అందరినీ ఆందోళనలో పడేస్తున్న ఈ ఆర్థిక అనిశ్చితి అనేక పాఠాలను చెబుతోంది. చిన్నదైనా, పెద్దదైనా సమస్యలను తట్టుకోవాలంటే ప్రతి ఒక వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత.., పొదుపు- మదుపు ఏమిటి?, అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకోవాలి.. అందుకు అవసరమైన అత్యవసర నిధిని సృష్టించటం ఎలా.. అనే ఆలోచన చేయాలి.
ఈ కొత్త ఏడాదిలోనే ఇది ప్రారంభిద్దాం..
లెక్కప్రకారం పెట్టుబడులు..
మనలో చాలామంది అక్షరాస్యులం! కానీ ఆర్థిక అక్షరాస్యులం కాదు. ఆర్థిక ప్రణాళిక ఎలా చేసుకోవాలో? ఎలా తెలివిగా మదుపు చేయాలో, పెట్టుబడి పెట్టాలో తెలిసినవారు చాలా తక్కువమంది. ఆర్థిక ప్రణాళిక అంటే డబ్బులు దాచుకోవటం అనుకుంటారు చాలామంది. కేవలం దాచుకుంటేనే సరిపోదు. దాచుకున్నదాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేయాలి. అలా చేయటంలో లాభం ఏంటి? రిస్క్ ఏంటో తెలియాలి. లాభం ఎక్కువ వస్తోందని గుడ్డిగా పోకుండా అందులోని రిస్క్ను కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని ఎవరో ఒకరి దగ్గర పెట్టి మోసపోయి నష్టపోవడం.. తెలియని బ్యాంకుల్లో పెట్టి మోసపోవడం సర్వసాధారణంగా చూస్తున్నదే. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు అంటే ఏమిటో తెలుసుకోవాలి. దీనివల్ల ప్రణాళిక సులభం అవుతుంది. కనీసం పదేళ్ల తర్వాత అవసరాలేంటో గుర్తించి వాటికెంత అవుతుందో లెక్కలు వేసుకొని, దానికనుగుణంగా పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో ప్రణాళిక వేసుకోవాలి. అదే ఆర్థిక అక్షరాస్యత!
50:30:20
ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, పొదుపు- మదుపు ఏమిటి? అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకోవాలి? అందుకు అవసరమైన అత్యవసర నిధిని సృష్టించటం ఎలా అనేది ఆలోచించాలి. ముఖ్యంగా.. ఆదాయాన్ని మించి ఖర్చు వద్దు. పొదుపు చేయగా మిగిలిన సొమ్మే ఖర్చు చేయాలి. 50:30:20 ప్రణాళికను అనుసరించాలి. అంటే.. సంపాదనలో ఖర్చు 50 శాతాన్ని మించకూడదు. 30 శాతం సొమ్మును మన దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు కేటాయించాలి. 20 శాతం సొమ్మును పొదుపు చేయాలి.
ఇష్టారాజ్యం సరికాదు..
సాధ్యమైనంత వరకూ పెద్ద పెద్ద అప్పులు చేయకుండా ఉండటం మేలు. క్రెడిట్ కార్డు చేతిలో ఉందని, ఇష్టారాజ్యంగా దాన్ని గీకటం కూడా సరికాదు. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీ వాళ్లు.. ఫోన్ చేసి అప్పు ఇస్తున్నారని ఏ అవసరం లేకపోయినా తీసుకుంటే, ఆ సొమ్ము దేనికో ఖర్చయిపోతుంది. చివరికి ఆ అప్పు తీర్చలేక తిప్పలు పడాల్సి వస్తుంది. ఏదైనా మూలధన అవసరాలకు (ఆస్తులు కొనడం, పిల్లలను చదివించడం వంటివి) ఒక పరిమితికి లోబడి అప్పులు చేయడంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగత ఖర్చులకు, సరదాలు- షికార్లకు అప్పులు చేస్తే మాత్రం ఇబ్బందే.
ఆ రెండూ తప్పనిసరి
2022లో తరచూ వినిపించిన పదం లాంగ్ కొవిడ్. ఈ మహమ్మారి ప్రభావం మన ఆరోగ్యంపై, కుటుంబాలపై ఇంకా ఉంది. ఇలాంటి ఉపద్రవాల నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి.
చిన్న వయసులోనే...
ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలంటారు. ఆర్థిక ప్రణాళికకు కూడా అదే వర్తిస్తుంది. 20ల్లో ఏం చేయాలో, 30ల్లో ఏం చేయాలో, 40ల్లో ఏం చేయాలో ముందుగా ఆలోచించుకొని ఆచరణలో పెడితే నిశ్చింతగా ఉండొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్లాంటివి చిన్న వయసులో చేస్తే తక్కువ మొత్తం ప్రీమియంతో, ఎలాంటి ఆరోగ్య పరీక్షలు లేకుండా వచ్చేస్తాయి.
సిప్లు నిశ్చింతగా...
మ్యూచువల్ ఫండ్ల ద్వారా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న రిటైల్ మదుపరులు మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా తమ సిప్ కొనసాగించాలి. మార్కెట్ సూచీలు పెరిగాయని సిప్ మొత్తాలు పెంచటం, తగ్గినప్పుడు నిలిపివేయడం సరికాదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కొనుక్కోవడం, మీకిష్టమైన కారును సొంతం చేసుకోవడం.. ఇలా ఎటువంటి కలనైనా సాధించాలంటే, ఇటువంటి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఉండాలి.
కనీసం 3 నెలలకు సరిపడా...
ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనకేం కాదులే అనుకోవడానికి లేదు. అందుకే ఒక అత్యవసర నిధిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్వహించాలి. కనీసం మూడు నెలల ఖర్చులకు అవసరమైనంత సొమ్ము ఎప్పుడూ సేవింగ్స్ ఖాతాలో ఉండాలి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి.. ఈ నిధిలో కొంత సొమ్మును ఖర్చు చేసినా, మళ్లీ వెంటనే భర్తీ చేయాలి.
30ల్లోనే విరమణ గురించి...
పదవీ విరమణ అనేది 60కి దగ్గర్లోనే అయినా.. దాని ప్రణాళిక మాత్రం 30ల్లోనే మొదలవ్వాలి అంటారు ఆర్థికరంగ నిపుణులు. అప్పటి నుంచే రిటైర్మెంట్ తదనంతర జీవితానికి అవసరమైన అంచనాలతో ప్రణాళిక సాగాలి. ఇప్పటి యువతరంలోనైతే కొంతమంది 50లోపే ఉద్యోగ విరమణ గురించి ఆలోచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయండి
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. -
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఎన్నికల నిఘా వేదిక పరిశీలకులు జీవీ కృష్ణారావు అన్నారు. -
ఆ 15 రోజులు ఎప్పటికి వచ్చేనో?
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమంటూ జగన్ డప్పు కొట్టుకుంటారు. తాను వచ్చాకే సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా బూరలు ఊదుతారు. -
ఉద్యాన రైతుకు.. ఉరి!
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. పూలు, పండ్లు, కూరగాయల సాగే లాభదాయకం అన్న భావన కలిగించింది. -
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
పేదల గొంతెండబెట్టిన జగన్!
జనానికి గుక్కెడు నీరిచ్చే.. జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులకూ సహకరించని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డే.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!