విద్యా ‘కానుక’ గుత్తేదార్లకే!
వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది.
బ్యాగ్పై సగటున రూ.92, బూట్లపై రూ.14 చొప్పున అధికం
2 లక్షల మంది విద్యార్థులు తగ్గినా.. రూ.155 కోట్ల భారం
ఈ ఏడాది చినిగిన బ్యాగ్లు సరఫరా చేసినా చర్యలు శూన్యం
అయిదు ప్యాకేజీల్లో ముగ్గురు పాత కాంట్రాక్టర్లే
ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. నోటు పుస్తకాలు మినహా మిగతా అన్నింటి సరఫరాకు ఇప్పటికే గుత్తేదార్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్లతో విద్యాకానుక కిట్లను అందించనున్నారు. బూట్లు, బ్యాగ్ల ధరలు 2022-23 నాటికంటే ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన, పెద్దసైజు బ్యాగ్లు ఇవ్వడం, ఈసారి మరింత మెరిసే బూట్లు కొంటున్నందున ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నా.. గుత్తేదార్లు రింగ్ కావడంతోనే ధరలు పెరిగాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగ్ల సరఫరాకు మొదట టెండర్లు పిలిచినప్పుడు గుత్తేదార్లు రింగై ఎక్కువ ధరకు కోట్ చేయడంతో వాటిని రద్దుచేశారు. అనంతరం బ్యాగ్ల సైజులను మూడు రకాలుగా విభజించి, అయిదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందులో ఒక ప్యాకేజీ మినహా నాలుగింటిలో నిర్ణీత ధర కంటే 10% నుంచి 15% వరకూ అధికంగా కోట్ చేశారు. రివర్స్ టెండర్లలోనూ రెండు ప్యాకేజీల్లో ధర తగ్గకపోవడంతో గుత్తేదార్లతో అధికారులు బేరాలు చేశారు. చివరికి రూ. 272.90కి సరఫరా చేసేందుకు గుత్తేదార్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇది కూడా 2022-23లో ఇచ్చిన బ్యాగ్ ధర కంటే రూ.92 ఎక్కువ. విచిత్రమేమిటంటే మూడు ప్యాకేజీల్లో బ్యాగ్ల టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు ఈ సంవత్సరం సరఫరా చేసినవారే! రెండు ప్యాకేజీలకే కొత్తవారు వచ్చారు. బ్యాగ్లను సరఫరా చేస్తున్న ఇద్దరు గుత్తేదార్లకు బూట్ల సరఫరాలోనూ రెండు ప్యాకేజీలు దక్కాయి. 2023-24లో సరఫరా చేయనున్న బ్యాగ్ల ధరలు రూ. 269.60 నుంచి రూ. 272.90 వరకూ ఉన్నాయి. ఒక్క ప్యాకేజీలోనే రూ. 269.60 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. జత బూట్లు, రెండు జతల సాక్సులను ఈ ఏడాది సరాసరిన రూ. 175కు అందించగా.. వచ్చే ఏడాది ఇచ్చేవాటి సగటు ధర రూ. 189. ఒక్కో దానిపై రూ. 14 వరకూ పెరిగింది. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు తగ్గినా... ఈసారి ప్రభుత్వ ఖజానాపై పడే భారం మాత్రం రూ.155.84 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం!
..అయినా చర్యలు తీసుకోరా?
ఈ ఏడాది సరఫరా చేసిన బ్యాగ్ల్లో నాణ్యత లేక చినిగిపోయినట్లు ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల సమయంలో గుత్తేదార్లు ఇచ్చిన నమూనా బ్యాగ్ కనిపించకపోయినా కిందిస్థాయిలో ఇద్దరు అధికారులను సెక్షన్ మార్చి, దీన్ని ముగించేశారు. బ్యాగ్లు చినిగినట్లు పెద్దసంఖ్యలో ఫిర్యాదులొచ్చినా గుత్తేదార్లు, అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. రాష్ట్రవ్యాప్తంగా 45,14,687 మందికి బ్యాగ్లను సరఫరా చేయగా.. 15 రోజులకే చాలాచోట్ల చినిగిపోయాయి. జులై 5 నుంచి అక్టోబరు 7లోపు సరఫరా చేసినవాటిలో చినిగిపోయిన బ్యాగ్ల వివరాలను ఆన్లైన్లో నమోదుచేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశించింది. దాదాపు 9 లక్షల బ్యాగ్లు చినిగినట్లు ప్రధానోపాధ్యాయులు నమోదుచేశారు. చినిగిన బ్యాగ్లను పిల్లలు వెనక్కి ఇస్తే కొత్తవి ఇవ్వలేదని విజిలెన్స్ తనిఖీల్లోనూ బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. -
ఆ 15 రోజులు ఎప్పటికి వచ్చేనో?
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమంటూ జగన్ డప్పు కొట్టుకుంటారు. తాను వచ్చాకే సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా బూరలు ఊదుతారు. -
ఉద్యాన రైతుకు.. ఉరి!
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. పూలు, పండ్లు, కూరగాయల సాగే లాభదాయకం అన్న భావన కలిగించింది. -
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
ఈ చదువులు మాకొద్దు ‘మామా’
జగన్ పాలనలో యువత ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ చదువులు మాకొద్దంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం.. విద్యా సంస్థలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేయడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. -
సుప్రీంకూ అబద్ధాలేనా?
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తీరు. -
పోస్టల్ బ్యాలట్ను 12 వరకు పొడిగించాలి
పోస్టల్ బ్యాలట్ ప్రక్రియను ఈనెల 12 వరకు పొడిగించాలని సీఈవోను పలువురు తెదేపా నేతలు.. ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావులు.. ఐక్యవేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారు. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
పెద్దల మాట
-
కార్టూన్
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!