పోలవరంలో ఇదేం దారుణం!
పోలవరం ప్రాజెక్టులో కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేసేస్తున్నారా? ఆ సంస్థలు అనుమతి ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
కేంద్ర సంస్థల అనుమతి లేకుండానే పనులు
సీపేజీ నీటిని దిగువకు పంపేందుకు డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణం
కేంద్ర జల్శక్తి దృష్టికి తీసుకువెళ్లిన పోలవరం అథారిటీ
విస్తుపోయిన కేంద్ర కార్యదర్శి చేయొద్దని చెప్పినా రాష్ట్రం వినడం లేదన్న పీపీఏ
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టులో కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేసేస్తున్నారా? ఆ సంస్థలు అనుమతి ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర జల్శక్తి శాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిసింది. దిల్లీలో నాలుగు రోజుల కిందట కేంద్ర జల్శక్తి కార్యదర్శి నిర్వహించిన కీలక సమావేశంలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శికి పీపీఏ తాజా పరిస్థితిని నివేదించినట్లు సమాచారం. పోలవరంలో ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ వల్ల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంచనాలకు మించి నీరు వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. ఆ నీటిని ఎత్తిపోయడం సులభం కాదు. పోలవరం పనులకు ఇదో పెద్ద సవాల్లా మారింది. కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ నిపుణులు వచ్చి ఇంకా ఈ ప్రాంతాన్ని పరిశీలించలేదు. మరోవైపు ఐఐటీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అలాంటిది దిగువ కాఫర్ డ్యాం కుడివైపున ఒక కొండతో అనుసంధానమయ్యే చోట తవ్వకాలు జరిపి డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణపనులు రాష్ట్రం మొదలుపెట్టేసింది. ఇలాంటి ప్రతిపాదనను పీపీఏ దృష్టికి తీసుకువెళ్లినా వారినుంచి అనుమతులు రాలేదు. ‘‘దిగువ కాఫర్ డ్యాం వద్ద ఎలాంటి తవ్వకాలు జరపవద్దు. అలా చేస్తే మళ్లీ దిగువ నుంచి నీరు ప్రధాన డ్యాం ప్రాంతంలోకి రావచ్చని చెప్పాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదు. దిగువ కాఫర్ డ్యాం వద్ద పనులు ప్రారంభించేశారు’’ అని కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో పీపీఏ ఫిర్యాదు చేసింది. ఈ విషయం విని కేంద్రజల్శక్తి కార్యదర్శి విస్తుపోయారు. ఇప్పటికే పోలవరంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. గైడ్బండ్ కుంగిపోయింది. ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్ ధ్వంసమయింది. ఇన్ని సవాళ్లు ఎదురవుతుండగా కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర నిపుణులు సమన్వయంతో ముందుకు సాగవలసిన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో కేంద్ర పెద్దలు విస్తుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులన్నింటికీ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ అనుమతి తీసుకున్నాకే చేశారు. తర్వాత ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడం పోలవరంలో పెను సమస్యలకు దారితీసింది. కాఫర్ డ్యాంలు నిర్మించకుండా, డయాఫ్రం వాల్ నిర్మించడం తప్పని సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారు. అన్ని అనుమతులూ ఉండి చేస్తేనే విమర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. అసలు ఎలాంటి అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. పైగా దిల్లీ సమావేశంలోనే పీపీఏ ఈ అంశాన్ని ప్రస్తావించడం కీలకం.
ఏం పనులు చేస్తున్నారు?
పోలవరం ప్రధాన డ్యాం నిర్మించేచోట వరద ప్రభావం లేకుండా ఉండేందుకు నిర్మించినవే ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు. వాటినుంచి కొంత సీపేజీ ఉంటుంది. అది సహజం. కానీ అంచనాలకు మించి సీపేజీ వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. ఈ విషయాన్ని రాష్ట్రం కేంద్ర సంస్థలకు నివేదించింది. దీని పరిష్కారానికి ఇంకా కేంద్ర సంస్థల నుంచి అనుమతులేవీ రాలేదు. ఈలోపే రాష్ట్రం పనులు చేపట్టేసింది. దిగువ కాఫర్ డ్యాం కుడివైపు ఒక కొండతో అనుసంధానమయ్యే చోట డిప్లీటింగు స్లూయిస్ తరహా నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం దిగువ కాఫర్ డ్యాం వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. బటర్ఫ్లై తరహాలో వాల్వ్ రూపంలో దీన్ని నిర్మిస్తున్నారు. దిగువ కాఫర్ డ్యాంకు దిగువన తక్కువ నీరు ఉండి... దిగువ కాఫర్ డ్యాంకు పైభాగంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో నిండిపోయిన నీటిని దిగువకు గ్రావిటీ ద్వారా పంపే వీలు ఉంటుంది. దిగువ కాఫర్ డ్యాం దిగువ నుంచి ఎగువకు నీరు రాకుండా.. ఎగువ నీరు గ్రావిటీ ద్వారా దిగువకు వెళ్లిపోయేలా ఈ నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. దిగువ కాఫర్ డ్యాం కుడివైపు కొండను కలిసేచోట అప్రోచ్ ఛానల్లా తవ్వుతారు. నీరు దిగువకు వెళ్లేటప్పుడు తెరుచుకునేలా, ఎగువకు నీరు రాకుండా మూసి ఉంచే ఏర్పాటు చేస్తారట. దిగువ కాఫర్ డ్యాం దిగువన +16 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడు ఎగువ నీరు గ్రావిటీ ద్వారా వెళ్లిపోయేలా చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచనకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని తెలిసింది. ఇంకా డిజైన్లు కూడా సమర్పించాలి. కేంద్ర జల్శక్తి శాఖ వర్గాల సమాచారం ప్రకారం పీపీఏ ఈ పని చేపట్టవద్దని అభ్యంతరం చెప్పింది. దిగువ కాఫర్ డ్యాం వద్ద ఎలాంటి పని చేసినా మరో సమస్య వస్తుందేమో చూడాలని చెప్పినట్లు సమాచారం. అలాంటిది అనుమతి లేకుండానే ఇప్పటికే తవ్వకం పనులు 20శాతానికిపైగా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ విషయమే జల్శక్తిలో చర్చనీయాంశమయింది.
సీపేజీపైనా చెప్పిన మాట వినలేదా?
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీపై కూడా గతంలోనే కేంద్రం పలుసార్తు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు జాగ్రత్తపడలేదని సమాచారం. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ ఎక్కువగా ఉంది. అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే పని సీజన్ కోల్పోతామని కేంద్ర సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు స్పందించలేదని జల్శక్తిలోని ఒక ప్రముఖుడు వెల్లడించారు. అంచనాలకు మించి సీపేజీ ఉన్నట్లు కనిపిస్తోందని వారు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు కొట్టిపడేసినట్లు చెబుతున్నారు. ఈ సీపేజీ అంచనాకు 30 రెట్లు అధికంగా నీరు వచ్చింది. ఎగువ కాఫర్ డ్యాంకు పైవైపున గోదావరి నీటిమట్టం 39 మీటర్ల స్థాయిలో ఉంటే దిగువన ప్రధాన డ్యాం ప్రాంతంలో 14 మీటర్ల వరకు నీరు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ మధ్య ప్రాంతంలో నేల ఎత్తు దాదాపు అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి అది పెద్ద సీపేజీ కాదని, ఆ నీటిని సులభంగా ఎత్తిపోసుకుంటూ పనులు చేసుకోవచ్చని అంచనాలు వేసుకున్నారు. అలాంటిది 22 మీటర్ల వరకు కూడా సీపేజీ నీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు
నిజానికి ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి ముందే ఇద్దరు ప్రొఫెసర్లు ఎంత సీపేజీ ఉంటుందో అంచనాలు రూపొందించారు. నాడు పాటించిన ఫార్ములాలో కొన్ని విలువలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ అంచనాల్లో తేడాలు వచ్చాయని ఇంజినీరింగు అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం