‘జగన్ ఏలుబడిలో..’ క్రీడా వికాసం ఉత్తిదే..!
గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అలాంటి వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
లేని క్లబ్బులకు సీఎం నామధేయం
శాప్ వెబ్సైట్లోనూ కనిపించని వైనం
ప్రచార ఆర్భాటమే.. నిధుల విడుదల ఏదీ..?
ఈనాడు - అమరావతి
క్రీడా క్లబ్బుల ఉద్దేశం
గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అలాంటి వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ఏర్పాటు చేసిన క్రీడా క్లబ్బుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించాలి. ఇందులో సచివాలయాల ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భాగస్వాములు కావాలి.
ఆచరణలో పక్కదారి
క్రీడా క్లబ్బుల ఉద్దేశం క్రమంగా పక్కదారి పట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడింది. మొదట హడావుడి చేసిన అధికారులు తరువాత మిన్నకుండిపోయారు. క్లబ్బుల రిజిస్ట్రేషన్, కార్యకలాపాల నిర్వహణ రికార్డులకే పరిమితమైంది. క్రీడాకారులు ముందుకొచ్చినా వీరిని ప్రోత్సహించే వారు కరవయ్యారు. క్రీడా క్లబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా శాప్ వెబ్సైట్ నుంచి తొలగించారు.
క్రీడల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమానికి నిధులివ్వడానికి ముఖ్యమంత్రి జగన్కు చేతులు రావడం లేదు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసుకోవడంలో తనకుమించిన వారు మరొకరు ఉండరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి తుస్సుమన్న క్రీడా క్లబ్బులకు జగన్ తాజాగా తన పేరు పెట్టుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్బులుగా ఉన్న వీటి పేరును ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు’గా మార్చారు. ఇందుకు సంబంధించిన గెజిట్ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. జగన్ ప్రచార పిచ్చిని చూసి క్రీడాకారులు విస్తుపోతున్నారు. ఆచరణలో లేని క్రీడా క్లబ్బులకు జగన్ పేరా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని అధికారులకు తరుచూ ఆదేశాలిచ్చే ముఖ్యమంత్రి జగన్కు గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదిన్నర కిందట గ్రామ సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా క్లబ్బులు కనిపించడం లేదు. ఇవి పని చేస్తున్నాయా? లేదా? అని సమీక్షించే తీరికా ముఖ్యమంత్రికి లేదు. క్షేత్రస్థాయిలో ప్రతిభ కలిగి తగిన ప్రోత్సాహం లేక కనుమరుగవుతున్న క్రీడాకారులను గుర్తించి తగిన శిక్షణ ఇవ్వకపోతే జాతీయ క్రీడాకారులు ఎలా తయారవుతారు? మాటలు చెబితే సరిపోతుందా? క్రీడా క్లబ్బులకు నిధులివ్వకుంటే జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేది ఎలా..?
చేతులెత్తేసిన మండల, జిల్లా పరిషత్లు
క్రీడా క్లబ్బుల మధ్య గ్రామస్థాయిలో పోటీల నిర్వహణకు మండల, జిల్లా పరిషత్తుల సాధారణ నిధుల నుంచి ఏటా 4% మొత్తాలను కేటాయించాలన్న ఆదేశాలు ఆచరణకు నోచుకోలేదు. వివిధ పద్దుల కింద ప్రభుత్వం నుంచి జిల్లా, మండల పరిషత్లకు రావాల్సిన నిధులను సరిగా విడుదల చేయడం లేదు. ఉన్న కొద్దిపాటి నిధులు సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో కొత్తగా ఎలాంటి పనులూ చేయడం లేదు. కేంద్రం మంజూరు చేసే ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వడం లేదు. దీంతో క్రీడా పోటీలకు నిధులివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అత్యధిక జిల్లాల్లో జిల్లా, మండల పరిషత్లు చేతులెత్తేశాయి. దీంతో క్లబ్బులు ప్రారంభించాక ఇప్పటికీ జిల్లాల్లో గ్రామస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో క్లబ్బుల ఏర్పాటులో మొదట ఎంతో చురుగ్గా పాల్గొన్న క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెనక్కి తగ్గారు.
క్రీడా వికాస కేంద్రాలకూ గ్రహణం
క్రీడా కార్యక్రమాలకు తన పేరు పెట్టుకోవడంలో ముందుండే జగన్ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాలకు గ్రహణం పట్టించారు. గ్రామ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో గత ప్రభుత్వం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాల భవన నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించింది. దాదాపు 50 నియోజకవర్గాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని పూర్తి చేయకుండా పక్కన పెట్టింది. ఇవి పూర్తయితే క్రీడాకారులకు గ్రామస్థాయిలో శిక్షణ అందుబాటులోకి వచ్చేది. భవన నిర్మాణాలు పూర్తయిన చోట వీటి నిర్వహణకు నిధులివ్వడం లేదు.
ఇలా ఏర్పాటు.. అలా కనుమరుగు
రాష్ట్రంలో 11,162 క్రీడా క్లబ్బులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి గత ఏడాది ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక క్లబ్బు ఉండేలా అప్పట్లో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం క్లబ్బుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి 2022 జూన్ 8న ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. పంచాయతీ, మండల, జిల్లా స్థాయి స్పోర్ట్స్ అథారిటీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. క్రీడా క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రతి నెలా పోటీలు నిర్వహించాలి. విజేతలతో మళ్లీ మండల, జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసి వీటిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. సంకల్పం బాగున్నా..నిధుల కొరతతో ఆచరణలోకి వచ్చే సరికి క్లబ్బులు చతికిలపడ్డాయి. వీటికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM