NRI:పల్లె ప్రగతికి ప్రవాస హారతి
ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపుతున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది భారతీయులే. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఒక్క 2020-21 సంవత్సరంలోనే స్వదేశానికి ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు.
స్వగ్రామాలకు ఎన్ఆర్ఐల సొబగులు
బడులు.. ఇళ్లు.. ఆసుపత్రులు.. ఎత్తిపోతల నిర్మాణాలు
పురిటి గడ్డపై వీడని మమకారం
ఈనాడు - అమరావతి
ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపుతున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది భారతీయులే. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఒక్క 2020-21 సంవత్సరంలోనే స్వదేశానికి ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు.
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఏ స్థాయికి ఎదిగినా... మాతృభూమిపై మమకారాన్ని వీడలేదు. తమను ఇంతవారిని చేసిన సొంతూరి అభివృద్ధిలో తాము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. తమతో పాటు.. తమ పల్లె ప్రజలంతా బాగుండాలని, వారి జీవితాలూ మెరుగుపడాలని సేవలందిస్తున్నారు పలువురు ప్రవాసాంధ్రులు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగి విదేశాల్లో స్థిరపడ్డ వీరంతా... జన్మభూమి రుణం తీర్చుకునేలా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొందరు వ్యక్తిగత స్థాయిలో సాయం అందిస్తుండగా.. మరికొందరు ట్రస్టులు ఏర్పాటుచేసి వాటి పేరుతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం కొంతమంది ప్రవాసాంధ్రులు నిధులు వెచ్చిస్తుండగా.. మరికొందరు విద్యార్థుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇంకొందరు చిన్నతనంలో తాము చదువుకున్న బడికి కొత్తరూపు కల్పించి ఔదార్యం చాటుకుంటున్నారు. ఇంకొందరు ప్రవాసాంధ్రులైతే తమ సొంతూరిలోని ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వటం, నిర్మాణానికి కొంత ఆర్థిక చేయూత అందించటం, ఎత్తిపోతల పథకాలు నిర్మించటం వంటివీ చేస్తున్నారు. మరి కొద్దిమందైతే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వంటివీ ఏర్పాటుచేశారు. తమ ఊళ్లోని అందరికీ తాగునీరు ఉచితంగా అందేలా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో సేవలందిస్తూ కన్నభూమి రుణం తీర్చుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు ప్రాంతానికి చెందిన నెప్పల సుబ్బారాయుడు ఒక ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేసి 28 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదల కోసం పక్కా ఇళ్లు, ఊరికి ఎత్తిపోతల పథకం, పాఠశాలకు మౌలిక సదుపాయాలు, సిమెంటు రహదారులు, బస్సు షెల్టర్లు.. ఇలా అనేకం నిర్మించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రామినేని అయ్యన్నచౌదరి, అనంతరం ఆయన కుమారుడు ధర్మప్రచారక్ రామినేని ఫౌండేషన్ను ఏర్పాటుచేసి భారీఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, సిమెంటు రోడ్లు, పశువైద్యశాల, ఓవర్హెడ్ట్యాంకు, పోలీసు కంట్రోల్రూం... ఇలాంటివి అందించారు. గురువులతో పాటు పలురంగాల ప్రముఖులకు పురస్కారాలు ఇస్తున్నారు. విజయవాడలోని సిద్దార్థ వైద్యకళాశాలలో చదివి, విదేశాల్లో స్థిరపడ్డవారు కలిసి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు సాయం చేశారు. అమెరికాలోని ఇన్ఫోవిజన్ సీఈవో యలమంచిలి సత్యశ్రీనివాస్ తన తల్లిపేరిట ట్రస్టు ఏర్పాటుచేసి, కృష్ణాజిల్లా యలమర్రులో విద్యార్థులకు ఉపకారవేతనాలతో చేయూతనిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతానికి చెందిన డాక్టర్ ననమాల ప్రేమసాగరరెడ్డి పన్నెండేళ్లుగా పాఠశాల అభివృద్ధికి నిధులిస్తూ ఉన్నారు. గ్రామమంతా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకం ఏర్పాటుచేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోహన్ సుధీర్ పట్టా విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జలశుద్ధి కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రం, గ్రంథాలయం నిర్మాణాలతో పాటు.. పాఠశాలకు మరమ్మతులు చేయించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన చెక్కపల్లి రమేష్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు ప్రాంతానికి చెందిన గవిరినేని వెంకట సుబ్బారావు తన తండ్రి పేరుమీద ట్రస్టు ఏర్పాటుచేసి, చదువులకు సాయం చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలానికి చెందిన కానూరి మురళీదామోదర్ పాఠశాల అభివృద్ధికి నిధులిచ్చారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి చెందిన పాపదేశి ప్రసాద్ తన తండ్రి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటుచేసి పిల్లలకు విద్యాసామగ్రి, గ్రామానికి వాటర్ ప్లాంటు తదితరాలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. -
ఓటెత్తిన ‘ప్రజా’స్వామ్యం
రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ వైకాపా విధ్వంసకాండ
ఏజెంట్లను భయపెట్టారు.. కూర్చుంటే తలకాయలే ఉండవని హూంకరించారు.. సాయంత్రం తిరిగి ఇళ్లకూ వెళ్లరని హెచ్చరించారు.. రేపటి నుంచి ఊళ్లలో తిరగలేరని బెదిరించారు. పోలీసులు ఉన్నా బెదరకుండా కిరాతకంగా వ్యవహరించారు. -
ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు
ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అంతే తప్ప, ఇష్టారాజ్యంగా లోపలకు వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో.. నిబంధనలు పాటించాలని తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అడగడమే ఆ ఓటరు తప్పయిపోయింది. -
మాచర్లలో రక్తం పారాల్సిందే..!
ఆటవిక పాలనను మించిన అరాచకాలకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధమైన వేళ.. అరాచకశక్తులు మరింతగా పేట్రేగిపోయాయి. ఐదేళ్లుగా నమ్ముకున్న దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు, హింసనే ఎన్నికల రోజున ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. -
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు
రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద అంగన్వాడీల ఆట సాయం
చిత్తూరు నగరంలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు అనేక మంది మహిళలు తమ చిన్నారులతో పోలింగ్ కేంద్రాలకు సోమవారం చేరుకున్నారు. -
ఓటేశాం.. వెళ్లొస్తాం!.. తెలంగాణ బాటపట్టిన ప్రజలు
సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. -
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
ఓ వైపు భర్త మృతిచెందినా.. తనలోని బాధను దిగమింగుకుని ఓటుపై అవగాహన కలిగిన చిరుద్యోగిగా ఓ మహిళ తన ప్రాథమిక హక్కు వినియోగించుకున్నారు. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
సంకల్పం ముందు వైకల్యం ఎంత!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన సురేశ్.. తన 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. -
నది దాటారు.. ఓటేశారు..
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనదార గిరిజన గ్రామాల ప్రజలు నదిలో నుంచి కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ ఓటేసిన వృద్ధురాలు
ఓటు విలువ తెలియక కొందరు ఇళ్లకే పరిమితమవుతుంటే.. పుట్టెడు దుఃఖాన్ని భరించి 80 ఏళ్ల వృద్ధురాలు తన కర్తవ్యాన్ని చాటారు. -
రెండు రౌండ్ల కాల్పులు.. ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ భూమిలోకి రెండురౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆ ధాటికి రాళ్లు ఎగిరి తగలడంతో ముగ్గురు గాయపడ్డారు. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
నెహ్రూ జులాజికల్ పార్క్లో తెల్లపులి మృతి
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!