Gautam Adani: ‘నీ ముందు సంపద అంతా వెలవెలబోయే’: గౌతమ్‌ అదానీ పోస్టు వైరల్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన చిత్రం ఆకట్టుకుంటోంది. 

Updated : 02 Apr 2024 15:11 IST

ముంబయి: కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani).. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. ప్రత్యర్థులకు దీటుగా దూసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాలు రచించడంలో తలమునకలై ఉంటారు. అలాంటి వ్యక్తి తాజాగా ఎక్స్‌ వేదికగా పెట్టిన ఓ పోస్టు ఆకట్టుకుంటోంది.

తన చిట్టి మనవరాలితో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈసందర్భంగా ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తంచేశారు. ‘‘నీ చూపుల్లోని వెలుగు ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోయే’’ అని రాసుకొచ్చారు. ఆ పాప పేరు కావేరీ. గౌతమ్ అదానీ-ప్రీతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు కరణ్, జీత్‌. ఆ పాప కరణ్‌-పరిధి కుమార్తె.

తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా

లండన్‌లోని సైన్స్‌ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్‌ ఎనర్జీ గ్యాలరీని ఏర్పాటుచేశారు. అక్కడే తనవాళ్ల మధ్యలో ఈ చిత్రాన్ని తీసుకున్నారు. మనవరాళ్లతో ఆడుతుంటే.. తన పని ఒత్తిడి మొత్తం మాయమవుతుందని ఓ సందర్భంలో అదానీ వెల్లడించారు. ‘‘వారితో సమయం గడపడం నాకెంతో ఇష్టం. పని, కుటుంబమే నా ప్రపంచం’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని