Airtel: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..
Airtel: ఎయిర్టెల్ త్వరలో టారిఫ్లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యాలిడిటీతో ఈ టెలికాం సంస్థ అందిస్తున్న ప్లాన్లు ఏంటో చూద్దాం. ప్లాన్ల ధరలు పెరగక ముందే వీటితో రీఛార్జ్ చేసుకుంటే ఎంతో కొంత ఆదా అయ్యే అవకాశం ఉంది.
దిల్లీ: ఒక వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంలో భాగంగా ఎయిర్టెల్ టారిఫ్లను పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ మేరకు ప్రకటన రావొచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిఛార్జ్ మరింత భారం కాకముందే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటే మేలు. తద్వారా ఒకే తరహా ప్రయోజనాల కోసం ఎక్కువ మొత్తం చెల్లించకుండా ఆదా చేసుకునే అవకాశం ఉంది.
ఏడాది గడువుతో ఎయిర్టెల్ మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వాటి ధరలు రూ.3,359, రూ.2,999, రూ.1,799. ఒక్కో దాంట్లోని ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..
రూ.3,359 ప్లాన్..
ఎయిర్టెల్లో అధిక ప్రయోజనాలు ఉన్న ప్లాన్ ఇదే. అలాగే కంపెనీ అందిస్తున్న వాటిల్లో ఇదే అత్యంత ఖరీదైనది. దీంట్లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్లు లభిస్తాయి. ఏడాది వ్యవధితో డిస్నీ+ హాట్స్టార్ సభ్యత్వం కూడా ఉంటుంది. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్లు, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు.
రూ.2,999 ప్లాన్..
ఎయిర్టెల్ అందిస్తున్న రూ.2,999 ప్లాన్లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎసెమ్మెస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్లు, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ ప్లాన్ గడువు కూడా 365 రోజులు.
రూ.1,799 ప్లాన్..
ఏడాది కాలపరిమితితో వస్తున్న ప్లాన్లలో తక్కువ ధర ఉన్నది ఇదే. అపరిమిత వాయిస్ కాలింగ్, 5జీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్లు, వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్లు, అపోలో 24/7 సర్కిల్ వంటివి ఉన్నాయి. దీంట్లో 24జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. కేవలం దీర్ఘకాల వ్యాలిడిటీ మాత్రమే కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. డేటా ఎక్కువగా అవసరమయ్యే వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఎయిర్టెల్ వచ్చే జులై-అక్టోబరు మధ్య టారిఫ్లను 15% వరకు పెంచొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఆర్పు రూ.208గా ఉంది. మార్కెట్ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉండగా.. ఎయిర్టెల్ ద్వితీయ స్థానంలో ఉంది. వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. -
శాంసంగ్ కొత్త ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చేశాయ్.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Samsung Unpacked event: శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఫ్లిప్, ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చింది. -
మీ వస్తువులు మరిచిపోరిక.. రిలయన్స్ నుంచి జియో ట్యాగ్ ఎయిర్
JioTag Air: రిలయన్స్ జియో సంస్థ కొత్త ట్రాకింగ్ పరికరాన్ని లాంచ్ చేసింది. దీని ధరను రూ.1499గా నిర్ణయించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన