Anant Ambani: ‘అన్న సేవ’తో అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభం
Anant Ambani: ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమైంది.
జామ్నగర్: భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్కు సమీపంలో ఉన్న జోగ్వాడ్ గ్రామంలో ‘అన్న సేవ’తో బుధవారం రాత్రి వీటికి శ్రీకారం చుట్టారు. ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ సహా వారి కుటుంబ సభ్యులు, కాబోయే పెళ్లికుమార్తె రాధికా మర్చంట్ (Radhika Merchant)తో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా భోజనం వడ్డించారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలను గ్రామస్థులకు రుచి చూపించారు. దాదాపు 51 వేల మందికి రాబోయే కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
అనంత్, రాధిక ముందస్తు పెళ్లి వేడుకలకు (Anant Radhika pre wedding) స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ ‘అన్న సేవ’ను నిర్వహించింది. భోజనానంతరం ఆహ్వానితులు సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వి తన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా ‘అన్న సేవ’ కార్యక్రమాలను నిర్వహించడం అంబానీ కుటుంబంలో సంప్రదాయంగా వస్తోంది. యావత్ దేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ముకేశ్ సతీమణి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ భారీ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్.. 2500 రకాల వంటకాలు..!
ఈ ప్రీవెడ్డింగ్ సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరగనుంది. గుజరాత్లోని కచ్, లాల్పుర్కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందించనున్నారు. ఇటీవల రిలయన్స్ ఫౌండేషన్ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో గుజరాత్కు చెందిన మహిళలు ‘బంధని స్కార్ఫ్’లకు క్యూరింగ్ చేయడం కన్పించింది. క్లిప్లో, నీతా అంబానీ, చేతివృత్తుల కళాకారులను కలుసుకుని వారి కృషిని ప్రశంసించడం గమనించొచ్చు. మరోవైపు జామ్నగర్లో విశాలమైన ఆలయ సముదాయంలో కొత్త మందిరాల నిర్మాణాన్నీ అంబానీ కుటుంబం చేపట్టింది.
అనంత్, రాధిక నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. ముకేశ్-నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్, అనంత్. వీరు గత కొన్నేళ్లుగా రిటైల్, డిజిటల్ సేవలు, నూతన ఇంధనం సహా రిలయన్స్ కీలక వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. అనుబంధ సంస్థల బోర్డుల్లోనూ సేవలందిస్తున్నారు.
‘అందుకే జామ్నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన
రిలయన్స్ రిటైల్ విస్తరణకు ఈశా నేతృత్వం వహిస్తున్నారు. ఆకాశ్ అంబానీ జూన్ 2022 నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అనంత్ నూతన ఇంధనం, మెటీరియల్ వ్యాపారాల విస్తరణను పర్యవేక్షిస్తున్నారు. ఈశాకు 2018లో, ఆకాశ్కు 2019లో వివాహం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్