Apple: భారత్‌లో భారీగా పెరిగిన యాపిల్‌ ఆదాయం

Eenadu icon
By Business News Team Published : 05 Sep 2025 13:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా (USA) టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) వ్యాపారం భారత్‌లో విస్తరిస్తోంది. గతేడాది ఈ సంస్థ ఆదాయం ఏకంగా 9 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 13శాతం ఎక్కువ. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ కథనంలో వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్‌ డాలర్లను సంపాదించినట్లు తెలిపింది. భారత్‌లో యాపిల్‌ ఫోన్లకు భారీగా డిమాండ్‌ పెరగడమే దీనికి కారణమని వెల్లడించింది. 

ఈ మొత్తం ఆదాయంలో ఐఫోన్‌ నుంచి వచ్చిందే ఎక్కువ. ఇక మ్యాక్‌ బుక్‌ విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రయాల్లో పెద్దగా పెరుగుదల లేని సమయంలో భారత మార్కెట్‌ ఆ సంస్థకు కీలకంగా మారింది. 

 దేశంలో తొలి టెస్లా కారు.. ఎవరు కొన్నారంటే..?

ప్రస్తుతం ఆ సంస్థ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్‌ అయిన చైనాలో పోటీ గణనీయంగా పెరిగింది. అక్కడ విక్రయాలు జూన్‌ త్రైమాసికంలో 4.4శాతం వృద్ధి చెందాయి. రెండేళ్ల తర్వాత అమ్మకాల్లో పురోగతి కనిపించింది ఇప్పుడే. ఈ సమయంలో భారత్‌ మార్కెట్‌లో స్థిరంగా వృద్ధి సాధించడం కీలకంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మరో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించింది. వీటిల్లో ఒకటి బెంగళూరు మరొకటి పుణెలో ఏర్పాటు చేశారు. దీంతో భారత్‌లో యాపిల్‌ (Apple) స్టోర్ల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి రెండూ దిల్లీ, ముంబయిలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. యాపిల్‌ (Apple) కు అమెరికా (USA), చైనా (China), జపాన్‌ (Japan) తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ నిలిచింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు