Gmail: జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ

జీమెయిల్‌ను మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి గూగుల్‌ తెరదించింది. ఎప్పటిలానే ఈ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Updated : 27 Feb 2024 14:52 IST

Gmail | ఇంటర్నెట్‌ డెస్క్: గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ (Gmail) సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్‌ (google) స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది.

ఏళ్లుగా లక్షలాది మందికి ఇ-మెయిల్‌ సేవలు అందిస్తున్న జీమెయిల్‌ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్‌ పంపించడం గానీ, పొందడం గానీ చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్‌కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. అది కాస్తా ఎక్స్‌, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది జీమెయిల్‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

బైజూస్‌లో ముదిరిన వివాదం

ఈ ప్రచారంపై గూగుల్‌ స్పందించింది.  జీమెయిల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. తద్వారా సోషల్‌మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి చెక్‌ పెట్టింది. ఈ ప్రచారంపై టెక్‌ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా ప్రకటనలను ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జీమెయిల్‌ తన హెచ్‌టీఎంఎల్‌ వెర్షన్‌ సర్వీసులను మాత్రమే నిలిపివేసింది. నెట్‌వర్క్‌ సరిగా లేని సమయంలోనూ ఇ-మెయిల్స్‌ పొందడం ఈ సర్వీసుల ఉద్దేశం. రెగ్యులర్‌ ఇ-మెయిల్‌ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని