రాళ్లు తినండి.. పిజ్జాపై గమ్ వేసుకోండి.. వివాదాస్పదమైన గూగుల్ ఏఐ సమాధానాలు
Google: గూగుల్ ఏఐ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రశ్నలకు తప్పుదోవ పట్టించేలా సమాధానం ఇస్తోందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
Google | ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) ఇటీవల అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని (Gemini AI)’ని అందుబాటులోకి తెచ్చింది. కచ్చితత్వంతో తక్షణ సమాధానాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఏఐ టూల్ అందించే జవాబులపై యూజర్ల నుంచి అసంతృప్తి ఎదురవుతోంది. తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విచిత్రమైన సమాధానంతో మరోసారి చిక్కుల్లో పడిందీ ఏఐ టూల్.
‘రోజుకు ఎన్ని రాళ్లు తినాలి’ అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు జెమిని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆరోగ్యంగా ఉండటానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ రాళ్లలో ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినమని సలహా ఇచ్చింది. ఓ వైద్యుడు ఆ మేరకు సలహా ఇచ్చినట్లు పేర్కొంది. పిజ్జాపై చీజ్ నిలవట్లేదని మరో యూజర్ ప్రశ్నిస్తే.. ఎంచక్కా గమ్ వేసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చింది. అంతేకాదు.. అమెరికాకు ముస్లిం అధ్యక్షుడెవరని ప్రశ్నిస్తే.. బరాక్ హుస్సేన్ ఒబామా అంటూ కొందరు యూజర్లకు బదులిచ్చింది. ఇలా తప్పుదోవ పట్టించే సమాధానాలను ఇస్తోందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. గూగుల్ ఏఐ జవాబులకు సంబంధించిన స్క్రీన్షాట్ను ఓ యూజర్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
గూగుల్ ఏఐ ఇస్తున్న సమాధానాలు పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త ఫీచర్ తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఆశ్రయిస్తే ప్రమాదం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై గూగుల్ స్పందించింది. చాలావరకు ఏఐ ప్లాట్ఫామ్లు వెబ్లో ఉన్న సమాచారాన్నే ఇస్తుంటాయన్నారు. పై ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఈ ప్రశ్నలు కూడా అసాధారణంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు. -
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డ్లు కొనుగోలు చేయొచ్చు..?
SIM Cards: మీ ఆధార్ నంబర్తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? అసలు ఒక్క ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయొచ్చు? -
టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్తో పరుపులు.. ఆవిష్కరించిన వేక్ఫిట్
వేక్ఫిట్ సంస్థ టెంపరేచర్ కంట్రోల్ సదుపాయంతో కొత్త తరహా పరుపులను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
వాటర్ ప్రూఫ్తో ఒప్పో ఎఫ్27 ప్రో+.. వివరాలు ఇవే..
Oppo F27 Pro+: ఒప్పో కొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.28 వేలుగా నిర్ణయించింది. -
డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో షావోమీ కొత్త మొబైల్.. ధర ఎంతంటే?
Xiaomi 14 Civi: షావోమీ తన 14 లైనప్లో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాలు చూసేయండి. -
హెచ్ఎండీ బ్రాండ్పై ఫీచర్ ఫోన్లు.. యూపీఐ సదుపాయంతో 105, 110 మోడళ్లు
HMD feature Phones: నోకియా బ్రాండ్పై ఫోన్లు తయారుచేసే హెచ్ఎండీ సంస్థ 105, 110 పేరిట రెండు ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210.. ఫీచర్లు ఇవే..
Nokia 3210 4G: నోకియా 3210 ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధరను రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది. -
ఈ ప్లాన్ వ్యాలిడిటీని పెంచిన ఎయిర్టెల్
Airtel: భారతీ ఎయిర్టెల్ కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జి ప్లాన్ గడువును పెంచింది. -
భారత్లో వాట్సప్ బిజినెస్ అకౌంట్స్కు మెటా వెరిఫైడ్
భారత్ సహా బ్రెజిల్, ఇండోనేసియా, కొలంబియా దేశాల్లోని వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం వెరిఫైడ్ ప్రోగ్రామ్ను మెటా తీసుకొచ్చింది. -
టీ20 వరల్డ్ కప్.. ఎయిర్టెల్లో డిస్నీ+ హాట్స్టార్ కొత్త ప్లాన్లు
Airtel Recharge Plans: టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలోఉంచుకొని ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్, ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఇలా మూడు మాధ్యమాల కస్టమర్లకు డిస్నీ+ హాట్స్టార్తో కూడిన ప్లాన్లను అందుబాటులో ఉంచింది. -
వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ.లక్షన్నర పైనే!
Vivo X Fold 3 Pro: స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 8.03 అంగుళాల ప్రధాన తెర వంటి స్పెసిఫికేషన్లతో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోల్డబుల్ ఫోన్ భారత్లో విడుదలైంది. -
7 రోజుల బ్యాటరీ లైఫ్తో నాయిస్ ప్రీమియం స్మార్ట్వాచ్.. ధర, ఫీచర్లివే..
NoiseFit Origin: నాయిస్ ఫిట్ ఆరిజిన్ అనే కొత్త స్మార్ట్వాచ్ మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, ప్రాసెసర్తో వచ్చిన ఈ ఫోన్ ధర, ఇతర వివరాలు చూద్దాం.. -
Airtel: టీ20 వరల్డ్కప్.. క్రికెట్ ప్రియుల కోసం ఎయిర్టెల్ కొత్త ప్లాన్
Airtel Prepaid Plan: క్రికెట్ యూజర్ల కోసం ఎయిర్టెల్ కొత్త రీఛార్జి ప్లాన్ను తీసుకొచ్చింది. దీంతో మూడు నెలల పాటు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్, 3.3TB డేటాతో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు
Bharti Airtel: క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ తమ యూజర్ల కోసం రూ.1,000లోపు ధరతో నాలుగు ప్లాన్లను అందిస్తోంది. వాటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. -
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
MrBeast: 26.6 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లతో మిస్టర్బీస్ట్ ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న యూట్యూబ్ ఛానల్గా నిలిచింది. టీ-సిరీస్ను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. -
ఇకపై గూగుల్ మెసేజ్లనూ ఎడిట్ చేయొచ్చు
Google Messages: గూగుల్ మెసేజెస్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇందులో పంపే సందేశాల్లో ఏవైనా తప్పులుంటే ఎడిట్ చేసే అవకాశం కల్పించింది. -
ఎయిర్టెల్, జియో బాటలో వీఐ.. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో కొత్త రీఛార్జి ప్లాన్లు
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా వీడియో స్ట్రీమింగ్ వేదిక నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన నెట్వర్క్ను మరింత బోలోపేతం చేసేందుకు ఈ సహకారం ఉపయోగపడుతుందని పేర్కొంది. -
ఒక్క ఐఫోన్ మార్కెట్లోకి తేవడానికి ఇన్ని ఫోన్లపై టెస్టులా?
ఐఫోన్ డ్యూరబిలిటీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కంపెనీ హార్డ్వేర్ ఇంజినీరింగ్ అధిపతి జాన్ టెర్నస్. ఒక్క ఐఫోన్ మార్కెట్లోకి తేవడానికి 10 వేల కంటే ఎక్కువ ఫోన్లను పరీక్షిస్తుందన్నారు. -
50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ.. రూ.10 వేలకే లావా 5జీ ఫోన్
Lava Yuva 5G: యువతరాన్ని దృష్టిలోకి ఉంచుకొని లావా కొత్త ఫోన్ను విడుదల చేసింది. రూ.10 వేలకే వస్తున్న 5జీ ఫోన్ కావడం విశేషం. -
స్కామ్ కాల్స్కు ఏఐతో చెక్.. ట్రూకాలర్ కొత్త ఫీచర్
Truecaller: ట్రూకాలర్ సంస్థ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఏఐ సాయంతో చేసే కాల్స్ను గుర్తించేందుకు కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. -
విండోస్ ఫోన్ లింక్ యాప్లో కొత్త ఫీచర్.. ఫొటోలో టెక్ట్స్ ఇక కాపీ
విండోస్ ఫోన్ లింక్ యాప్ని మరింత అప్డేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి