Instagram Teen Safety Update: టీనేజర్ల భద్రతకు ఇన్స్టాగ్రామ్ కొత్త చర్యలు.. సినిమా స్థాయిలో పరిమితులు

Instagram Teen Safety Update | ఇంటర్నెట్ డెస్క్: మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) టీనేజర్ల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో అమలు చేసే పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని టీనేజ్ యూజర్లకు అందుబాటులో ఉండే కంటెంట్పై పరిమితులు విధించనుంది. 18 ఏళ్లలోపు ఉన్న యూజర్లను ఆటోమేటిక్గా 13+ సెట్టింగ్లో ఉంచుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. ఈ సెట్టింగ్ను తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీనేజ్ యూజర్లు మార్చుకోలేరని తెలిపింది.
సినిమాలు, షోలు అనుసరించే పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాల తరహాలో ఈ మార్పులు ఉంటాయని ఇన్స్టా తన న్యూస్రూమ్ పోస్ట్లో తెలిపింది. ఇందులో అతి హింసాత్మక సన్నివేశాలు, అశ్లీల కంటెంట్, డ్రగ్స్ వాడకం, అసభ్య పదజాలం వంటి అంశాలను నియంత్రించనుంది. గతేడాది నుంచి టీన్ అకౌంట్లపై తీసుకొస్తున్న భద్రతా చర్యల్లో ఇది అత్యంత ప్రధానమైన అప్డేట్ అని పేర్కొంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ఆటోమేటిక్ ప్రొటెక్షన్లను బలోపేతం చేస్తూ, మరింత కఠినమైన ఫిల్టరింగ్ విధానాన్ని ప్రవేశపెడుతుందని ఇన్స్టా తెలిపింది.
తప్పు వయసు సమాచారంతో పెద్దవారిలా నటించే టీనేజర్లను గుర్తించడానికి.. ఇన్స్టాగ్రామ్ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ‘వయసు అంచనా టెక్నాలజీ’ని వినియోగిస్తోంది. అన్ని నియంత్రణలున్నప్పటికీ కొన్నిసార్లు అనుచితమైన కంటెంట్ కనిపించొచ్చని.. దీన్ని అధిగమించడానికి వీలైనంత త్వరగా తమ ఆల్గరిథమ్ను అభివృద్ధి చేస్తామని కంపెనీ తెలిపింది. టీనేజర్లకు సురక్షితమైన, వయసుకు తగిన కంటెంట్ అందిస్తూ.. తల్లిదండ్రులకు మరింత నియంత్రణ ఇచ్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైందని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జియో యూజర్లకు ఫ్రీ జెమిని ప్రో ప్లాన్.. ఎలా పొందాలి?
ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన యూజర్లకు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది. - 
                                    
                                        

జియో యూజర్లకు గుడ్న్యూస్.. 18 నెలల పాటు జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ
Gemini Pro for jio users: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్న్యూస్. జియో టెలికాం యూజర్లకు గూగుల్కు జెమినీ ప్రో (Gemini Pro) ప్లాన్ ఉచితంగా లభించనుంది. - 
                                    
                                        

శాంసంగ్ డిజిటల్ కార్ ‘కీ’.. ఫోన్తో మహీంద్రా SUV అన్లాక్, స్టార్ట్!
Samsung Digital car key: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కనెక్టింగ్ ఫీచర్ను భారత్కు విస్తరించింది. శాంసంగ్ యూజర్లు త్వరలో తమ గెలాక్సీ స్మార్ట్ఫోన్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీలను అన్లాక్ చేసి, స్టార్ట్ చేయొచ్చు. - 
                                    
                                        

ఫేస్బుక్ తరహాలో వాట్సప్లోనూ కవర్ఫొటో
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. - 
                                    
                                        

గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు
Google Pixel 10 Price Drop: గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. - 
                                    
                                        

వికీపీడియాకు పోటీగా ఎలాన్ మస్క్ ఏఐ గ్రోకిపీడియా
Grokipedia goes live: బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏఐ అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ (xAI)’ తాజాగా మరో సంచలనానికి నాంది పలికింది. - 
                                    
                                        

వన్ప్లస్ 15 విడుదల.. త్వరలో భారత్కు.. స్పెసిఫికేషన్లు ఇవే!
OnePlus 15: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ వన్ప్లస్ 15ను చైనాలో లాంచ్ చేసింది. - 
                                    
                                        

రూ.7 వేలకే లావా నుంచి షార్క్ 2 4జీ
Lava Shark 2 4G: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్ను భారత్లో లాంచ్ చేసింది. - 
                                    
                                        

వాట్సప్ చాట్ విండోలోనే ఇక స్టోరేజ్ మేనేజ్మెంట్
ఇంటర్నెట్ డెస్క్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ యూజర్లకు స్టోరేజ్ మేనేజ్మెంట్ను మరింత సులభం చేయనుంది. - 
                                    
                                        

వన్ప్లస్ 15, ఐకూ 15.. నవంబర్లో రాబోయే ఫోన్లు ఇవే..!
5 Best Upcoming Phones: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో మళ్లీ కొత్త మోడళ్ల సందడి మొదలు కానుంది. పండగ వేళ కొత్త ఫోన్ల విడుదల తగ్గుముఖం పట్టగా.. మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. - 
                                    
                                        

యాపిల్కి పోటీగా.. శాంసంగ్ నుంచి తొలి గెలాక్సీ XR హెడ్సెట్
Samsung Galaxy XR Headset: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన మొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్సెట్ను ఆవిష్కరించింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని పరిచయం చేసింది. - 
                                    
                                        

పిక్సెల్ ఫోన్లు టెస్ట్ చేస్తారా?.. అభిమానులకు గూగుల్ ఆహ్వానం!
Google invites Superfans: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్ అభిమానులకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ‘ట్రస్టెడ్ టెస్టర్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. - 
                                    
                                        

వాట్సప్లో యాంటీ స్పామ్ ఫీచర్.. ఆ మెసేజ్లపై లిమిట్!
Whatsapp anti spam: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ స్పామ్ మెసేజ్లను నియంత్రించేందుకు సిద్ధమవుతోంది. - 
                                    
                                        

గూగుల్ వన్ దీపావళి ఆఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్!
Google One Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ వన్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.11కే లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను పొందొచ్చు. - 
                                    
                                        

ఇన్స్టాగ్రామ్లో దీపావళి స్పెషల్ ఎఫెక్ట్స్!
Instagram Diwali Themed Effects: వినియోగదారులకు దీపావళి సంబరాలను అందించేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక థీమ్తో ముందుకొచ్చింది. - 
                                    
                                        

హానర్ వినూత్న ప్రయత్నం.. రోబోటిక్ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్
Honor: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కొత్త తరహా స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. - 
                                    
                                        

మరో కొత్త ఫీచర్కు వాట్సప్ రెడీ.. ఇకపై స్టేటస్కీ నోటిఫికేషన్!
WhatsApp New Feature: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యూజర్లు.. తమకు ఇష్టమైన కాంటాక్టులు కొత్త స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ పొందగలరు. - 
                                    
                                        

6 ఏళ్లు OS అప్డేట్స్+ సెక్యూరిటీ అప్డేట్స్తో శాంసంగ్ M17
Samsung Galaxy M17 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ (Samsung Galaxy M17 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. - 
                                    
                                        

జీమెయిల్ నుంచి జోహోమెయిల్కి మారాలనుకుంటున్నారా? ఎలాగో చూసేయండి
Gmail to Zoho Mail: జీమెయిల్ నుంచి జోహో మెయిల్కి మారడం చాలా సులభం. మీ మెయిల్స్, కాంటాక్ట్స్ ఏవీ కోల్పోకుండా మారొచ్చు. అదెలాగో చూద్దాం.. - 
                                    
                                        

HMD నుంచి హైబ్రిడ్ ఫోన్.. బుల్లి టచ్ ఫోన్ విశేషాలివే!
HMD Touch 4G phone: నోకియా బ్రాండ్పై ఫోన్లను తయారుచేసే ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండీ (HMD) సంస్థ తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ ఫీచర్లను అందిస్తూ యువత, విద్యార్థులు లక్ష్యంగా కొత్త ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 


