iPhone 15 Series: టైప్-సి పోర్ట్.. యాక్షన్ బటన్.. ఐఫోన్ 15 సిరీస్లో కొత్త మార్పులివే!
iPhone 15 Series: యాపిల్ ఈవెంట్ సెప్టెంబరు 12న కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. ఐఫోన్ 15 సిరీస్ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గత సిరీస్లతో పోలిస్తే వీటిలో చాలా మార్పులున్నాయి. అవేంటో చూద్దాం..!
iPhone 15 Series | ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఉత్పత్తుల విడుదల కోసం టెక్ దిగ్గజం యాపిల్ ఏటా నిర్వహించే కార్యక్రమం మంగళవారం రాత్రి వండర్లస్ట్ పేరిట కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. దీంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల (iPhone 15 Series)తో పాటు వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంతా ఊహించినట్లుగానే ఈసారి ఫోన్లలో యాపిల్ కీలక మార్పులు చేసింది. గత సిరీస్లలో ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని కీలక ఫీచర్లను ఈసారి యాపిల్ బేస్ మోడళ్లకు తీసుకురావడం విశేషం. మరి గత ఐఫోన్లతో పోలిస్తే 15 సిరీస్ (iPhone 15 Series)లో చేసిన ప్రధాన మార్పులేంటో చూద్దాం..
డైనమిక్ ఐలాండ్..
గత ఏడాది ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ అనే ఫీచర్ను 14 ప్రో మోడల్స్లో మాత్రమే ఇచ్చింది. వాస్తవానికి ఇది చాలా మంది టెక్ ప్రియులను ఆకట్టుకున్న ఫీచర్. దీంతో ఈసారి 15 సిరీస్ (iPhone 15 Series)లో బేస్ మోడల్స్ అయిన ఐఫోన్ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus)లో కూడా దీన్ని జత చేసింది. భవిష్యత్లో రాబోయే అన్ని ఐఫోన్లలో దీన్ని ప్రామాణికం చేయనున్నట్లు తెలుస్తోంది.
డైనమిక్ ఐలాండ్ అంటే.. ఇది ఫోన్ తెర పైభాగంలో ఒక పిల్ ఆకారంలో ఉండే కటౌట్. దీంట్లో కెమెరా, ఫేస్ ఐడీ వంటి సెన్సర్లను పొందుపరుస్తారు. అయితే, దీని వల్ల లుక్పరంగా డిజైన్ అంతగా ఆకట్టుకోదు. అందుకే యాపిల్ ఈ పిల్కు వివిధ రకాల ఫంక్షన్స్ను జోడించింది. అందుకు అనుగుణంగా సాఫ్ట్వేర్ యూఐను మార్చింది. దీంతో ఈ కటౌట్ కేవలం స్క్రీన్పై ఒక ఖాళీ స్థలంలా కాకుండా ఒక ఫీచర్గా పనిచేస్తోంది. ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫంక్షన్లను ఇక్కడి నుంచే నియంత్రించేలా ఇది ఉపయోగపడుతుంది.
యూఎస్బీ టైప్-సి (USB- C)..
2012 నుంచి యాపిల్ తమ ఉత్పత్తులకు లైటెనింగ్ పోర్ట్తో ప్రత్యేక ఛార్జింగ్ బ్రిక్, కేబుల్ను ఇస్తూ వస్తోంది. కానీ, ఈసారి ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా యూఎస్బీ- సి పోర్ట్ను ఇచ్చింది. ఇకపై ఐఫోన్లో చార్జింగ్ అయిపోతే... పక్కవాళ్ల దగ్గరి నుంచి యూఎస్బీ-సి పోర్ట్ చార్జర్ తీసుకొని వాడుకోవచ్చు. దాదాపు ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్నింటికీ టైప్-సి పోర్టునే ఇస్తున్న విషయం తెలిసిందే.
ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే..
కొత్తగా యాక్షన్ బటన్ (Action Button)..
గతంలో ఫోన్కి పక్కభాగంలో వాల్యూమ్ రాకర్పైన మ్యూట్ లేదా వైబ్రేట్ బటన్ను ఇచ్చేవారు. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ (iPhone 15 pro)లో దాన్ని యాక్షన్ బటన్తో రీప్లేస్ చేశారు. కెమెరాను యాక్టివేట్ చేయడం, ఫ్లాష్లైట్ ఆన్ చేయడం, వాయిస్ మెమో, నోట్ను ప్రారంభించడం, ఫోకస్ మోడ్లను మార్చడం వంటి ఫంక్షన్లను ఈ బటన్ ద్వారా చేయొచ్చు. గతంలో మాదిరిగా రింగ్, వైబ్రేట్ ఆప్షన్స్ను కూడా ఈ బటన్ ద్వారా మార్చుకునేందుకు వీలుంటుంది. పైగా మనం ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్లను కూడా ఈ బటన్కు అసైన్ చేసుకునే వీలుంటుంది.
కెమెరా అప్గ్రేడ్..
కెమెరా విషయంలోనూ ఐఫోన్ 15 బేస్ మోడల్స్ను గత సిరీస్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పటి వరకు 12MP మెయిన్ సెన్సర్ కెమెరాను ఇస్తూ వచ్చారు. ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లో 48MP కెమెరాను ఇవ్వడం విశేషం.
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్లో ఏ16 బయోనిక్ ప్రాసెసర్ను ఇచ్చారు. ఇది కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. గతంలో దీన్ని ప్రో మోడల్స్కు మాత్రమే పరిమితం చేశారు. ఈసారి 15 సిరీస్లోని ప్రో మోడల్స్కు ఏ17 ప్రాసెసర్ను రిజర్వ్ చేశారు. ఐఫోన్ 14 బేస్ మోడల్స్తో పోలిస్తే ఐఫోన్ 15 బేస్ మోడల్స్ 7 రెట్లు వేగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్
గతంలో ప్రో మోడల్స్కు మాత్రమే పరిమితమైన ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ను ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లోనూ ఇస్తున్నారు. దీంతో ఫింగర్ప్రింట్లు సహా ఇతరత్రా మరకల నుంచి కెమెరా లెన్సెస్ను దూరంగా ఉంచొచ్చు. పైగా లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.
టైటానియం డిజైన్..
ఐఫోన్ 15లో ప్రో (iPhone 15 pro) మోడల్స్ను టైటానియం డిజైన్తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్ బరువు చాలా వరకు తగ్గుతుంది.
ఎప్పటి నుంచి అందుబాటులోకి...
భారత్లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 22 నుంచి ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని యాపిల్ తన వెబ్సైట్లో పేర్కొంది.
భారత్లో ధరలు (iPhone 15 Series Indian Prices)..
- ఐఫోన్ 15- రూ.79,900
- ఐఫోన్ 15 ప్లస్- రూ.89,900
- ఐఫోన్ 15 ప్రో- రూ.1,34,900
- ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్- రూ.1,59,900
- యాపిల్ వాచ్ సిరీస్ 9- రూ.41,900
- యాపిల్ వాచ్ అల్ట్రా 2- రూ.89,900
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల