iPhone 15: టెక్ ప్రియులకు పండగే.. ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల, యాపిల్ వాచ్లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో ఇచ్చిన ఫీచర్స్, ధరలు ఒకసారి పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా చూసిన యాపిల్(Apple) మెగా ఈవెంట్ పూర్తయింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’(WonderLust) పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 15(iPhone 15) సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటు యాపిల్ వాచ్లు ‘వాచ్ సిరీస్ 9’(Watch Series 9), ‘వాచ్ అల్ట్రా 2’(Watch Ultra 2)ను విడుదల చేసింది. ఈ సారి టైప్-సీతో కూడిన ఛార్జింగ్ను ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో అమర్చడం విశేషం. ఇక వాచ్ల్లో బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో చాలా కొత్త ఫీచర్లు ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్లో ఎయిర్ప్యాడ్లను యాపిల్ విడుదల చేయలేదు. బహుశా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉంది. యాపిల్ విడుదల చేసిన ఐఫోన్లు, వాచ్ల సరికొత్త ఫీచర్లు, ధర ఒకసారి పరిశీలిస్తే..
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫీచర్స్, ధరలు..
ఐఫోన్ 14 మోడల్లో ఉన్నట్లే ఐఫోన్ 15లోనూ 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్లస్లో 6.7 అంగుళాల తెరను అమర్చారు. ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఇస్తున్నారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇవి లభ్యం కానున్నాయి. డైనమిక్ ఐలాండ్తో కూడిన కొత్త నాచ్ డిస్ప్లే, వెనక వైపు 2ఎక్స్ టెలిఫొటో సామర్థం ఉన్న 48 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్ను ఇచ్చారు. దీంతో హైరెజల్యూషన్ ఫొటోస్, వీడియోలను తీసుకోవచ్చు. తక్కువ కాంతిలో కూడా ఫొటోలు తీసుకునే విధంగా రూపకల్పన చేశారు. ఏ16 బయోనిక్ చిప్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్బీ-సీ పోర్ట్తో కూడిన ఛార్జింగ్ ఈ సారి కొత్తగా ఇచ్చారు. ఐఫోన్ 15 ధరలు భారత్లో రూ.79,900(799 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం అవుతాయి. ఇక ఐఫోన్ 15 ప్లస్ ధరలు రూ.89,899 (899 యూఎస్ డాలర్లు) నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్..
ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల తెర, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లో 6.7 అంగుళాల డిస్ప్లే ఇచ్చారు. ఈసారి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లు నాలుగు వేరియంట్లలో లభించనున్నాయి. టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్లో వీటిని తీసుకొచ్చారు. ఈ ఫోన్లలో వెనక వైపు 48 మెగాపిక్సల్ కెమెరా అమర్చారు. 3 ఫోకల్ లెంగ్త్ కెమెరా సైతం ఇచ్చారు. ఐఫోన్ 15 ప్రోలో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 15ప్రో మ్యాక్స్లో 5ఎక్స్ టెలిఫోటో లెన్స్ను ఇచ్చారు. ఇక 128 జీబీ స్టోరేజ్తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధరను భారత్లో రూ.1,34,900 (999 డాలర్లు), 256జీబీ స్టోరేజ్తో కూడి ప్రోమాక్స్ ధర రూ.1,59,900 (1199 డాలర్లు)గా నిర్ణయించారు.
వాచ్ సిరీస్ 9.. ఫీచర్స్, ధర..
వాచ్ సిరీస్ 9ను ఈసారి వినూత్నంగా తీసుకొచ్చారు. లెథర్ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. పర్యావరణహితంగా రూపుదిద్దారు. దీనిలో కొత్తగా ఎస్9 చిప్ను అమర్చారు. ఇది సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్బ్యాండ్ చిప్. గతవాటితో పోలిస్తే ఇది 30 శాతం వేగంగా పనిచేస్తుంది. ఉత్తమంగా హెల్త్ ట్రాక్ చేస్తుంది. యాపిల్ డివైజ్లతో కనెక్ట్ కావచ్చు. లోకేషన్ను మెరుగ్గా ట్రేస్ చేయవచ్చు. ఈ వాచ్ల్లో డబుల్ ట్యాప్ ఫీచర్ ఇచ్చారు. దీని ధర భారత్లో రూ. 41,900 నుంచి ప్రారంభం అవుతుంది.
వాచ్ అల్ట్రా 2..
యాపిల్ వాచ్ అల్ట్రా 2 త్వరగా ఛార్జింగ్ అయ్యేవిధంగా డిజైన్ చేశారు. 36 గంటల పాటు బ్యాటరీ వస్తుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్, ఫ్లాష్లైట్ బూస్ట్, న్యూ గెశ్చర్స్, యాక్షన్ బటన్, ఐఫోన్ ట్రేస్ చేయడం వంటివి ఇచ్చారు. డబుల్ ట్యాప్ ఫీచర్, సూర్యకాంతిలో స్పష్టంగా కనిపించేవిధంగా డిస్ప్లే అమర్చారు. ఈ వాచ్ ధరలు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్క్రీన్ లాక్ అయినా జెమినీతో పనులు
గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ను ఇప్పుడు లాక్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ల మీదా వాడుకోవచ్చు. ఇష్టమైన ఆదేశాలు జారీచేయొచ్చు. అలారమ్స్ పెట్టుకోవటం, మ్యూజిక్ ప్లే చేయటం వంటి పనులెన్నో చేసుకోవచ్చు. -
ఐఫోన్లో కృత్రిమ గొంతు
యాపిల్ ఇటీవల పర్సనల్ వాయిస్ ఫీచర్ను పరిచయం చేసింది. మన గొంతు మాదిరిగానే అనిపించే కృత్రిమ గొంతుతో స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
కొత్తగా పోకో ఎం6 5జీ ఫోన్లు
మనదేశంలో కొత్త 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో పోకో ఎం6 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వీటిని ప్రవేశపెట్టారు. -
త్వరలో నథింగ్ 2ఏ ప్లస్
ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన నథింగ్ ఫోన్ 2ఏ కోవలో మరో కొత్త వేరియంట్ రాబోతోంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రూపంలో త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తోంది. -
ఐఫోన్ను కంటితోనే కదిలించండి
తాజా ఐఓఎస్ 18 బీటా యూజర్లకు కొత్తగా ‘ఐ ట్రాకింగ్’ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే దీని సాయంతో కళ్లతోనే ఐఫోన్ను నియంత్రించొచ్చు. -
ఇంటికి కావాలో కెమెరా..
గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరైంది. వీటిల్లో తీగతో కూడినవి, తీగలు లేనివి.. రెండు రకాలున్నాయి. వీటికి బయటి నుంచి విద్యుత్తు సరఫరా తప్పనిసరి. -
యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేంతవరకూ ఆగాలా?
ఇంటెలిజెన్స్ అనే సొంత ఏఐ పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నట్టు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అందుబాటులోకి రావటానికి ఇంకా చాలా నెలలు వేచి చూడాల్సిందే. -
ఐఫోన్ మాయలు
వచ్చే ఐఓఎస్ 18, ఐప్యాడ్ఓఎస్ 18, మ్యాక్ఓఎస్ సుకోయాతో బోలెడన్ని కొత్త ఫీచర్లు రానున్నట్టు యాపిల్ సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో (డబ్ల్యూడబ్ల్యూడీసీ) ప్రకటించారు. -
పీసీ జోష్
డెస్క్టాప్, ల్యాప్టాప్ వంటి పీసీలతో గొప్ప ప్రయోజనం బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉండటం. గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వ్యాపార అవసరాలు.. ఇలా ఎలాంటి పనులకైనా సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. -
ఆనాటి పాత ఫోన్లే ముద్దు
ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా అధునాతన టెక్ పరికరాలే కనిపిస్తున్నాయి కదా. అయితే స్మార్ట్ఫోన్లు అధికంగా వాడటం మానసిక సమస్యలు పెరగటానికి కారణమవుతోందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తాజా నివేదిక పేర్కొంటోంది. -
ఫోన్ టైపింగ్ వేగంగా
కీబోర్డుల్లో మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్కీ ప్రత్యేకతే వేరు. ఉచితంగా లభించే దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలు రెండింటిలోనూ వాడుకోవచ్చు. వేగంగా టైప్ చేయటానికి తోడ్పడే కృత్రిమ మేధ (ఏఐ) సపోర్టుతో కూడిన ఇందులో ఫీచర్లూ చాలానే ఉన్నాయి. -
జీబోర్డు మాయ
ఆండ్రాయిడ్ ఫోన్లయినా, ఐఓఎస్ ఫోన్లయినా ఎక్కువమంది గూగుల్ కీబోర్డు వాడుతుంటారు. తేలికగా టైప్ చేయటానికి, ఇతరత్రా అవసరాలకు వన్ హ్యాండెడ్ మోడ్ దగ్గరి నుంచి ప్రత్యేక ఎమోజీలు పంపటం వరకూ ఇందులో బోలెడన్ని ఫీచర్లున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. -
ఐఫోన్లో సొంత రింగ్టోన్
ఐఫోన్లో హోం స్క్రీన్ మీద వాల్పేపర్ మార్చుకోవటం, లాక్ స్క్రీన్, విడ్జెట్స్ జత చేయటం వంటివి తప్పితే ఫీచర్లను ఇష్టమైనట్టుగా మార్చుకునే అవకాశం తక్కువ. షార్ట్కట్స్ యాప్తో ఐకన్లను మార్చుకోవచ్చు గానీ అదో పెద్ద ప్రయాస. అయితే ఇష్టమైన రింగ్టోన్ను పెట్టుకునే అవకాశముంది. -
ఐఫోన్తో సొంత డొమైన్
సొంత డొమైన్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఫోన్ ద్వారానే కొనుక్కోవచ్చు. చేతిలో ఐఫోన్, ఐక్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు. సొంత డొమైన్ పొందొచ్చు. -
వావ్.. మైక్రోసాఫ్ట్ డిజైనర్
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఫొటోలు, బొమ్మలు చిత్రించాలని అనుకుంటున్నారా? అయితే మైక్రోసాఫ్ట్ డిజైనర్(https://designer.microsoft.com/) టూల్ను ప్రయత్నించి చూడండి. -
పీసీ వేగంగా స్టార్ట్
కొత్త విండోస్ పీసీ కొద్ది సెకండ్లలోనే బూటప్ అవుతుంది. కానీ క్రమంగా నెమ్మదిస్తూ వస్తుంది. మరి పీసీ త్వరగా స్టార్టయ్యేలా చేయాలంటే? ఇందుకు కొన్ని ట్రిక్కులు లేకపోలేదు. -
స్మార్ట్ఫోనే రిమోట్
టెలివిజన్లలో ఇప్పుడు స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. టీవీ కార్యక్రమాలే కాకుండా ఓటీటీలు, యూట్యూబ్, అంతర్జాల వీక్షణ వంటి వాటికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
పీసీ షట్డౌన్ తేలికగా..
కంప్యూటర్ను షట్డౌన్ చేయటం పెద్ద పనేమీ కాదు. కానీ కొన్నిసార్లు చాలా త్వరగా షట్డౌన్ చేయాల్సి రావొచ్చు. అప్పుడు కీబోర్డు మీటలు కలిపి నొక్కే పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం