Realme C53: ₹10వేలకే 108 MP కెమెరాతో రియల్‌మీ కొత్త ఫోన్‌

Realme C53 Full details: రియల్‌మీ సీ53 మొబైల్‌ విడుదలైంది. రూ.10వేల ధరలో లభిస్తున్న ఈ ఫోన్ జులై 26 నుంచి సేల్‌కు రానుంది.

Updated : 19 Jul 2023 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme ) కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సీ53 (Realme C53) పేరిట దీన్ని తీసుకొచ్చింది. రూ.10వేల ధరలో 108 మెగా పిక్సల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ తీసుకొస్తుండడం గమనార్హం. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. కాకపోతే ఇది 5జీ ఫోన్‌ కాదు.. 4జీ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. ఒకవేళ 4జీలోనే మంచి ఫీచర్లతో ఫోన్‌ కావాలంటే ఈ ఫోన్‌ పరిశీలించొచ్చు.

రియల్‌మీ సీ53 రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా నిర్ణయించారు. ఎక్కువ ర్యామ్‌ కావాలంటే స్టోరేజీ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఛాంపియన్‌ గోల్డెన్‌, ఛాంపియన్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. జులై 26 నుంచి రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. జులై 19న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎర్లీ బర్డ్‌ సేల్‌ను రియల్‌మీ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.500 డిస్కౌంట్‌ లభిస్తుంది.

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. కాంటాక్ట్‌ సేవ్‌ చేయకుండానే మెసేజ్‌

ఇక ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐ టీ ఎడిషన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఆక్టాకోర్‌ 12 నానోమీటర్‌ ప్రాసెసర్‌ను వినియోగించామని పేర్కొన్నారు. ఏ ప్రాసెసర్‌ను వినియోగించారనేదీ వెల్లడించలేదు. వర్చువల్ ర్యామ్‌ను 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో వెనుకవైపు 108 ఎంపీ ఏఐ కెమెరా ఇచ్చారు. ఈ సెగ్మెంట్లో తొలి 108 ఎంపీ కెమెరా ఫోన్‌ తమదేనని కంపెనీ పేర్కొంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. యూఎస్‌బీఐ టైప్‌-సి పోర్ట్‌, 3.5 ఎంఎం జాక్‌ వంటివి ఉన్నాయి. ఇందులో ఉన్న 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని