Samsung: ఏఐ ఫీచర్లతో శాంసంగ్‌ కొత్త టీవీలు.. 8K మోడల్స్‌ ధర ₹3 లక్షల పైనే..!

Samsung: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఫీచర్లతో శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Published : 18 Apr 2024 00:03 IST

Samsung | ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థ శాంసంగ్‌ (Samsung) తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. నియో క్యూఎల్‌ఈడీ 8కె (Neo QLED 8K), నియో క్యూఎల్‌ఈడీ 4కె (Neo QLED 4K), ఓఎల్‌ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్‌ టీవీలను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లతో వీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ టీవీలు 55 అంగుళాల నుంచి 98 అంగుళాల వరకు వివిధ రకాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

శాంసంగ్‌ నియో క్యూఎల్‌ఈడీ 8కె (Neo QLED 8K) ప్రారంభ ధర రూ.3,19,990గా కంపెనీ నిర్ణయించింది. నియో క్యూఎల్‌ఈడీ 4కె (Neo QLED 4K) ధర రూ.1,39,990 నుంచి మొదలవుతుంది. ఓఎల్‌ఈడీ టీవీ ధరలు రూ.1,64,990 మొదలవుతాయి. 8K టీవీలు QN900D, QN800D అనే రెండు మోడళ్లలో లభిస్తాయి. మూడు రకాల స్క్రీన్‌ పరిమాణాలు (65, 75, 85 అంగుళాలు) ఉంటాయి. ఈ స్మార్ట్‌ టీవీలో NQ8 AI జెన్‌3 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 8కె సిరీస్‌లోని స్మార్ట్‌టీవీల్లో ఏఐ పిక్చర్ టెక్నాలజీ, ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో, ఏఐ మోషన్ ఎన్‌హాన్సర్ ప్రో, రియల్ అండ్ డెప్త్ ఎన్‌హాన్సర్ ప్రో, ఏఐ కస్టమైజ్డ్‌ మోడ్, ఏఐ ఎనర్జీ మోడ్.. లాంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో యూజర్లు మెరుగైన సౌండ్‌, డిస్‌ప్లే అనుభవాన్ని పొందుతారని కంపెనీ చెబుతోంది.

యూపీఐ లావాదేవీలు.. ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యానికి NPCI చెక్‌..!

ఇక 4K స్మార్ట్‌ టీవీలు QN85D, QN90D వేరియంట్లలో ఐదు రకాల డిస్‌ప్లే పరిమాణాల్లో (55, 65, 75, 85, 98 అంగుళాలు) అందుబాటులో ఉంటాయి. S95D, S90D వేరియంట్లలో నాలుగు రకాల స్క్రీన్‌ పరిమాణాల్లో (55, 65, 77, 83 అంగుళాలు) లభిస్తాయి. మోషన్‌ ఎక్సలేటర్‌ ఫీచర్లతో తీసుకొచ్చిన టీవీ 144Hz రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటాయి. ప్రత్యేక లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 2024 స్మార్ట్‌ టీవీ సిరీస్‌లోని ఎంపిక చేసిన వాటిని కొనుగోలు చేస్తే రూ.79,990 విలువైన సౌండ్‌బార్‌ను ఉచితంగా అందించనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. ఎంపిక చేసిన మోడల్‌ని బట్టి రూ.29,990 విలువైన మ్యూజిక్‌ ఫ్రేమ్‌, రూ.59,990 విలువైన ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్‌, 20 శాతం క్యాష్‌బ్యాష్‌ ఇవ్వనుంది. ఏప్రిల్‌ 30 వరకు మాత్రమే ఈ సదుపాయం ఉండనుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని