Samsung AI: ఏఐ ఫీచర్లతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు.. ఆవిష్కరించిన శాంసంగ్
Samsung: ఏఐ సాంకేతికత జోడించిన రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను శాంసంగ్ కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. విద్యుత్ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సాయపడుతుందని పేర్కొంది.
Samsung AI powered home appliances | ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) కొత్త అంకానికి తెర లేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతో పనిచేసే గృహోపకరణాలను ఆవిష్కరించింది. అంతర్గత కెమెరా, బెస్పోక్ (bespoke) AI చిప్తో కూడిన రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను తీసుకొచ్చింది. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం ఉత్పత్తుల్లో తన సత్తా చాటడానికి ఏఐ సాంకేతిక ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.
‘‘గృహోపకరణాల్లో బెస్పోక్ ఏఐ సాంకేతికతను జోడించాం. దీనివల్ల ఆయా వస్తువులు వినియోగదారులు కోరుకున్నట్లు పని చేస్తాయి. సులభంగా నియంత్రించే సదుపాయం కూడా ఉంది. ఏదైనా రిపేర్ ఉన్నా సులువుగా గుర్తించడం వీలు పడుతుంది. విద్యుత్తు వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఏఐ సాయపడుతుంది. దీనివల్ల భారత్లో డిజిటల్ ఉపకరణాల మార్కెట్లో మేం మరింత శక్తిమంతంగా మారుతామని విశ్వసిస్తున్నాం’’ అని శాంసంగ్ సౌత్వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జేబీ పార్క్ తెలిపారు.
యాపిల్ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్’ అలర్ట్..
శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత గృహోపకరణాల్లో ఇన్బిల్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, కెమెరా, ఏఐ చిప్ ఉంటాయి. దీంతో స్మార్ట్థింగ్స్ అప్లికేషన్ ద్వారా గృహోపకరణాలను నియంత్రించొచ్చు. ఏఐ అల్గారిథమ్ సాయంతో విద్యుత్ను ఆదా చేస్తాయని శాంసంగ్ తెలిపింది. రిఫ్రిజిరేటర్లో 10 శాతం, ఎయిర్ కండిషనర్ల్లో 20 శాతం, వాషింగ్ మెషీన్లో అయితే 70 శాతం వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయని కంపెనీ చెబుతోంది. పైగా ఏఐ వల్ల ఉత్పత్తులు ఎక్కువ కాలం పనిచేస్తాయని పేర్కొంది. భవిష్యత్లో ఓఎస్ అప్డేట్స్ ద్వారా మరిన్ని ఏఐ ఫీచర్లు జోడిస్తామని కంపెనీ తెలిపింది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ కూడా ఉంటుందని పేర్కొంది.
ఎలా పనిచేస్తాయ్?
రిఫ్రిజిరేటర్లలో ఉండే ఏఐ విజన్ కెమెరాలు స్టోర్ చేసే ఆహార పదార్థాలను గుర్తిస్తాయి. అవి పాడవకుండా ఉండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంతే ఉండేలా చూస్తాయి. పాడయ్యేందుకు అవకాశం ఉన్న ఆహార పదార్థాలు ఉంటే వెంటనే యూజర్కు నోటిఫికేషన్ పంపిస్తాయి. ఇంటికొచ్చేసరికి గదిని చల్లగా ఉంచాలనుకుంటే వెల్కమ్ కూలింగ్ ఫంక్షన్ ద్వారా ఏసీని ఆపరేట్ చేయొచ్చు. స్మాట్ థింగ్స్ అప్లికేషన్ సాయంతో ఏసీని ఆన్, ఆఫ్ చేయొచ్చు. లోడ్, దుస్తులు రకాన్ని ఏఐ కలిగిన వాషింగ్ మెషీన్లు వాటింతట అవే వాష్ ఫీచర్లను ఎంచుకుంటాయి. కావాల్సినంత నీటిని, డిటర్జెంట్ను తీసుకుంటాయి. ఈ గృహోపకరణాన్నీ శాంసంగ్ బిక్స్బీ ఏఐ వాయిస్ అసిస్టెంట్కు సపోర్ట్ చేస్తాయి. అంటే వాయిస్ కమాండ్స్తో కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి