Samsung AI: ఏఐ ఫీచర్లతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు.. ఆవిష్కరించిన శాంసంగ్
Samsung: ఏఐ సాంకేతికత జోడించిన రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను శాంసంగ్ కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. విద్యుత్ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సాయపడుతుందని పేర్కొంది.
Samsung AI powered home appliances | ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) కొత్త అంకానికి తెర లేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతో పనిచేసే గృహోపకరణాలను ఆవిష్కరించింది. అంతర్గత కెమెరా, బెస్పోక్ (bespoke) AI చిప్తో కూడిన రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లను తీసుకొచ్చింది. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం ఉత్పత్తుల్లో తన సత్తా చాటడానికి ఏఐ సాంకేతిక ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.
‘‘గృహోపకరణాల్లో బెస్పోక్ ఏఐ సాంకేతికతను జోడించాం. దీనివల్ల ఆయా వస్తువులు వినియోగదారులు కోరుకున్నట్లు పని చేస్తాయి. సులభంగా నియంత్రించే సదుపాయం కూడా ఉంది. ఏదైనా రిపేర్ ఉన్నా సులువుగా గుర్తించడం వీలు పడుతుంది. విద్యుత్తు వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఏఐ సాయపడుతుంది. దీనివల్ల భారత్లో డిజిటల్ ఉపకరణాల మార్కెట్లో మేం మరింత శక్తిమంతంగా మారుతామని విశ్వసిస్తున్నాం’’ అని శాంసంగ్ సౌత్వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జేబీ పార్క్ తెలిపారు.
యాపిల్ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్’ అలర్ట్..
శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత గృహోపకరణాల్లో ఇన్బిల్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, కెమెరా, ఏఐ చిప్ ఉంటాయి. దీంతో స్మార్ట్థింగ్స్ అప్లికేషన్ ద్వారా గృహోపకరణాలను నియంత్రించొచ్చు. ఏఐ అల్గారిథమ్ సాయంతో విద్యుత్ను ఆదా చేస్తాయని శాంసంగ్ తెలిపింది. రిఫ్రిజిరేటర్లో 10 శాతం, ఎయిర్ కండిషనర్ల్లో 20 శాతం, వాషింగ్ మెషీన్లో అయితే 70 శాతం వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయని కంపెనీ చెబుతోంది. పైగా ఏఐ వల్ల ఉత్పత్తులు ఎక్కువ కాలం పనిచేస్తాయని పేర్కొంది. భవిష్యత్లో ఓఎస్ అప్డేట్స్ ద్వారా మరిన్ని ఏఐ ఫీచర్లు జోడిస్తామని కంపెనీ తెలిపింది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ కూడా ఉంటుందని పేర్కొంది.
ఎలా పనిచేస్తాయ్?
రిఫ్రిజిరేటర్లలో ఉండే ఏఐ విజన్ కెమెరాలు స్టోర్ చేసే ఆహార పదార్థాలను గుర్తిస్తాయి. అవి పాడవకుండా ఉండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంతే ఉండేలా చూస్తాయి. పాడయ్యేందుకు అవకాశం ఉన్న ఆహార పదార్థాలు ఉంటే వెంటనే యూజర్కు నోటిఫికేషన్ పంపిస్తాయి. ఇంటికొచ్చేసరికి గదిని చల్లగా ఉంచాలనుకుంటే వెల్కమ్ కూలింగ్ ఫంక్షన్ ద్వారా ఏసీని ఆపరేట్ చేయొచ్చు. స్మాట్ థింగ్స్ అప్లికేషన్ సాయంతో ఏసీని ఆన్, ఆఫ్ చేయొచ్చు. లోడ్, దుస్తులు రకాన్ని ఏఐ కలిగిన వాషింగ్ మెషీన్లు వాటింతట అవే వాష్ ఫీచర్లను ఎంచుకుంటాయి. కావాల్సినంత నీటిని, డిటర్జెంట్ను తీసుకుంటాయి. ఈ గృహోపకరణాన్నీ శాంసంగ్ బిక్స్బీ ఏఐ వాయిస్ అసిస్టెంట్కు సపోర్ట్ చేస్తాయి. అంటే వాయిస్ కమాండ్స్తో కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!