SEBI clean chit to adani: హిండెన్బర్గ్ ఆరోపణలు.. గౌతమ్ అదానీకి సెబీ క్లీన్చిట్

SEBI clean chit to adani | దిల్లీ: హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి క్లీన్చిట్ లభించింది. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా షార్ట్ సెల్లర్ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టంచేసింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్తో పాటు ఆ గ్రూప్నకు చెందిన ఇతర కంపెనీలపైనా హిండెన్బర్గ్ సంస్థ 2023 జనవరిలో తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీల్లో నిధుల మళ్లింపునకు అడికార్ప్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్స్టోన్ ట్రేడ్లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను అదానీ గ్రూప్ వినియోగించిందని ఆరోపించింది. అదానీ గ్రూప్ కంపెనీలతో జరిగిన లావాదేవీల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమలేష్ సీ వార్ష్నీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మదుపర్లను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని సెబీ స్పష్టంచేసింది. అదానీ గ్రూప్ సంస్థలు గానీ, ఎగ్జిక్యూటివ్లు గానీ ఎలాంటి తప్పూ చేయలేదని, జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది.
అప్పట్లో నిపుణుల కమిటీ
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. సుమారు 150 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందనడానికి ఆధారాల్లేవని ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక స్పష్టంచేసింది. దీంతో భారీగా పతనమైన గ్రూప్ షేర్లు మళ్లీ కోలుకున్నాయి. తాజాగా సెబీ కూడా క్లీన్చిట్ అదానీ గ్రూప్నకు ఊరట కల్పించే అంశం. మరోవైపు ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ సంస్థ.. ఈ ఏడాది జనవరిలో తన కార్యకలాపాలు మూసివేయడం గమనార్హం.
వారు దేశానికి క్షమాపణ చెప్పాలి: అదానీ
సెబీ క్లీన్చిట్ ఇచ్చిన వేళ గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. హిండెన్బర్గ్ ఆరోపణలు అవాస్తవమని మరోసారి రుజువైందన్నారు. తాము ఎప్పటినుంచో ఇదే విషయం చెప్తున్నామన్నారు. ఈ కుట్రపూరిత నివేదిక కారణంగా పెట్టుబడిదారులు నష్టపోయినందుకు బాధగా ఉందన్నారు. తప్పుడు వాదనలు ప్రచారం చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతి నిర్మాణంలో తమ నిబద్ధత కొనసాగుతుందందన్నారు. తన పోస్ట్కు జాతీయ జెండాను జోడిస్తూ సత్యమేవ జయతే!, జైహింద్!! అని రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. - 
                                    
                                        

హిందుజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
Hinduja Group Chairman: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. - 
                                    
                                        

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. - 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


