Budget: ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీతారామన్.. మొరార్జీ దేశాయ్ తర్వాత ఈమే!
Budget: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఆరో బడ్జెట్.
దిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను (Union Budget 2024) ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందు వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్సిన్హా, మన్మోహన్సింగ్ను ఆమె అధిగమించనున్నారు. 1959-64 మధ్య మొరార్జీ ఐదు పూర్తిస్థాయి, ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు.
ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనుంది. తద్వారా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు నిధులను వెచ్చించడానికి సర్కార్కు వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్లో (Union Budget 2024) విధానపరమైన ప్రకటనలేమీ ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈవిషయాన్ని సీతారామన్ గతనెల ఓ సందర్భంలో స్పష్టంచేశారు. ఓటాన్ అకౌంట్కు ఆమోదం లభిస్తే.. ఏప్రిల్-జులై కాలానికి కావాల్సిన నిధులను ప్రో-రేటా ప్రాతిపదికన ‘భారత సంఘటిత నిధి’ నుంచి ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక 2024-25కు గానూ జూన్లో తుది బడ్జెట్ను తీసుకొస్తారు.
భారత తొలి బడ్జెట్..ఈ ఆసక్తికర విశేషాలు తెలుసా?
2014లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014-15 నుంచి 2018-19 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నెల చివరిరోజున బడ్జెట్ను తీసుకొచ్చే బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయానికి స్వస్తి పలికి ఒకటో తారీఖుకు మార్చిన ఘనత జైట్లీదే. ఆయన అనారోగ్యానికి గురవటంతో.. పీయూష్ గోయల్ ఆర్థికమంత్రి బాధ్యతలు తీసుకొని 2019-20 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ముందుంచారు. వేతన జీవుల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. వార్షికాదాయం రూ.5 లక్షలు మించనివారికి ట్యాక్స్ రిబేట్ను రూ.2,500 నుంచి రూ.12,500 చేశారు.
2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్కు (Nirmala Sitharaman) ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్ సంక్షోభ సమయంలో పేద వర్గాల కోసం అనేక ఉపశమన పథకాలను ప్రవేశపెట్టారు. ఆమె హయాంలో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోంది.
ఎన్పీఎస్ మరింత ఆకర్షణీయంగా..బడ్జెట్లో ప్రకటన?
మొరార్జీ దేశాయ్ అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థికశాఖ మంత్రి ఆర్.కె.షణ్ముగం చెట్టి తొలి బడ్జెట్ను పార్లమెంట్ ముందుకుతీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!