Vivo: లెదర్‌ ఫినిష్‌తో వివో కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే..

Vivo Smartphones: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో.. వై200 5జీ పేరిట కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Published : 23 Feb 2024 02:17 IST

Vivo Y200 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) తన ‘Y’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో వై200 5జీ (Vivo Y200 5G) పేరుతో లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 14, డ్యుయల్‌ కెమెరాతో రానున్న ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయని కంపెనీ పేర్కొంది. 

వివో వై200 5జీ మొబైల్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.20,999గా నిర్ణయించింది. సాఫ్రాన్‌ డిలైట్‌ లెదర్‌ ఫినిష్‌, బ్లాక్‌ డైమండ్‌ ప్లాస్టిక్‌ ప్యానెల్‌తో ఈ ఫోన్‌ రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ ద్వారా వివో వెబ్‌సైట్‌ నుంచి ప్రీ బుకింగ్‌ చేసుకున్నవారు రూ.1,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కస్టమర్లకు ఆరు నెలల నో- కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. ఫిబ్రవరి 29 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. మొబైల్‌ విక్రయాలు ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. మార్చి 1 నుంచి కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.

వాట్సప్‌లో పంపే టెక్ట్స్‌ మరింత ఆకర్షణీయంగా..

వివో కొత్త మొబైల్‌లో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటుతో పనిచేస్తుంది. 1,800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఇస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 (Android 14) ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌ 14తో వస్తోంది. కెమెరా విషయానికొస్తే.. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెన్సర్‌ ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని