WhatsApp group scam: పెరుగుతున్న వాట్సప్ గ్రూపు స్కామ్స్.. లాభాలంటూ వెళితే అంతే!
WhatsApp group scam: సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వాట్సప్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అంటూ మోసాలకు తెగబడుతున్నారు.
WhatsApp group scam | ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ మోసాలకు హద్దే లేకుండా పోతోంది. ఒకతరహా మోసాల నుంచి ప్రజలు అప్రమత్తమయ్యేలోపు.. మరో కొత్తతరహా మోసలకు తెరతీస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ ఆయుధంగా.. అత్యాశనే పావుగా చేసుకొని.. సామాన్యుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా వాట్సప్ గ్రూపులు (WhatsApp group) కట్టి స్టాక్ మార్కెట్లో లాభాలంటూ ఆశ చూపి మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా పుణెకు చెందిన ఇద్దరు సోదరుల నుంచి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయిలు కొట్టేశారు. ఈతరహా మోసాలు ఇటీవలకాలంలో పెరుగుతున్నాయి. ఇంతకీ ఎలా మోసం చేస్తున్నారు? వీటి బారి నుంచి బయటపడడం ఎలా?
మేకను బలివ్వాలంటే దానికి ముందు ఎర వెయ్యాలి. సైబర్ నేరగాళ్లదీ అదే పంథా. కాల్, వాట్సప్, సోషల్మీడియా ద్వారా వీరు సంప్రదిస్తారు. నమ్మకంగా మాట్లాడతారు. తర్వాత లాభాలు ఎర వేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటూ ఆకర్షిస్తారు. ఆ సలహాలు కూడా తామే ఇస్తామని నమ్మబలుకుతారు. అంతా ఓకే అనుకున్నాక.. వారిని ఓ వాట్సప్ గ్రూపులో చేరుస్తారు. ఆపై కథ మొదలవుతుంది.
స్టాక్ మార్కెట్కు సంబంధించి పెట్టుబడి సలహాలు, సూచనలతో సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపుల్లో సూచనలు చేస్తుంటారు. గ్రూపులో సభ్యులు వాటిని పాటిస్తున్నట్లు నటిస్తారు. ఇదంతా చూసినవారికి పెట్టుబడి పెట్టకపోతే తాము తీవ్రంగా నష్టపోతున్నామేమో అన్నట్లుగా భ్రమ కల్పిస్తారు. లాభాలంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారిచేత పెట్టుబడులు పెట్టిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రేడింగ్ అకౌంట్ను, సాఫ్ట్వేర్ను అందిస్తారు. తమ పెట్టుబడులకు రెట్టింపు ప్రతిఫలం అందులో చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా తీయడానికి ప్రయత్నిస్తే సెబీ మీ అకౌంట్ను లాక్ చేసిందని, ఫండ్స్ నిలిచిపోయాయని చెబుతారు. అప్పటికి గానీ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామన్న విషయం తెలియదు.
సోదరులకు రూ.2.45 కోట్లకు టోకరా
ఇటీవల పుణెకు చెందిన ఇద్దరు సోదరులు సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.2.45 కోట్లు కోల్పోయారు. ఇందులో ఒకరు రూ.1.68 కోట్లు, మరొకరు రూ.77.50 లక్షలు చొప్పున ఇలాగే పెట్టుబడి పెట్టారు. తమ పెట్టుబడికి ఏకంగా రూ.8 కోట్లు అయ్యిందని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. తీరా సొమ్ములు తీసుకుందామని ప్రయత్నించేటప్పుడు అసలు మోసం బయటపడింది. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి ప్రముఖుల పేర్లతోనూ వాట్సప్ గ్రూపుల్లో, సోషల్మీడియాలో ఈతరహా మోసాలకు పాల్పడుతున్నారు.
మోసాలకు చిక్కకుండా..
- ఇంటర్నెట్ వేదికగా పరిచయమయ్యే వారిని తొందరగా విశ్వసించొద్దు. ఎవరితోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు.
- పెట్టుబడులు, లాభాలు అంటూ ఎవరైనా మిమ్మల్ని వాట్సప్ గ్రూపుల్లో చేరిస్తే.. గ్రూపు పేరు, అడ్మిన్ వివరాలు వంటివి తెలుసుకోవాలి. అనుమానాస్పదంగా ఉంటే బయటకొచ్చేయడమే మంచిది.
- వాట్సప్ గ్రూపులు, సందేశాల్లో లాభాలు, ఆఫర్లు వచ్చేవాటిని గుడ్డిగా నమ్మొద్దు. వాటిల్లో వచ్చే లింకులు క్లిక్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయొద్దు.
- మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని వాట్సప్ గ్రూపుల్లో చేర్చడానికి వీల్లేకుండా వాట్సప్ సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం