Delhi: ప్రియుడిని చంపి.. మృతదేహంపై నెయ్యి, వైన్‌ పోసి..

Eenadu icon
By Crime News Desk Published : 28 Oct 2025 05:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అగ్నిప్రమాదంగా చిత్రీకరణ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థి అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడి మృతికి అగ్నిప్రమాదం కారణం కాదని, అతడితో సహజీవనం చేస్తున్న యువతే మరో ఇద్దరితో కలసి హత్యకు పాల్పడినట్లు తేలింది. అతడు అగ్నిప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్‌ చల్లి.. సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ చేసి పేలుడు జరిగేలా చేసినట్లు వెల్లడైంది. ఈనెల 6న తిమార్‌పుర్‌లోని ఓ భవనంలో  పేలుడు సంభవించింది. అక్కడి ఓ ఫ్లాట్‌లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. మృతుడిని రామ్‌కేశ్‌ మీనా(32)గా గుర్తించారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి భవనం లోపలకు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. కాసేపటి తర్వాత వారితో పాటు ఓ యువతి కూడా బయటకొచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది. ఆ యువతిని ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ విద్యార్థిని అమృతా చౌహాన్‌(21)గా గుర్తించారు. అమృత ప్రైవేటు వీడియోలను రామ్‌కేశ్‌ రికార్డు చేశాడని, వాటిని డిలీట్‌ చేసేందుకు అంగీకరించకపోవడంతో అమృత తన మాజీ ప్రియుడు, మరో స్నేహితుడితో కలసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని