Hyderabad: గొంతు కోసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.

Updated : 13 Sep 2023 10:17 IST

పటాన్‌చెరు అర్బన్‌: హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్నాపూర్‌లోని లక్డారం గేటు సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో వ్యాపారిని గొంతు కొసి చంపారు. హతుడు నిర్మల్‌ జిల్లా భైంసా వాసి అబ్దుల్‌ నదీమ్‌ తాహే(28)గా గుర్తించారు.

చంద్రబాబుపై బురద చల్లేలా.. ఫోన్‌ ఎత్తగానే దుష్ప్రచారంతో వాయిస్‌

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నదీమ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. సోదరి భర్త అనారోగ్యం కారణంగా ఇటీవల అతడి తల్లిదండ్రులు భైంసా నుంచి నగరంలోని టోలీచౌకిలో ఆమె నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నదీమ్‌ కూడా సోదరుడితో పాటు టోలీచౌకిలోని సోదరి ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి టీ తాగేందుకు స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా.. సంగారెడ్డి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేస్తున్నానని చెప్పాడు. తర్వాత కొంత సేపటికి ఫోన్‌ చేయగా నదీమ్‌ స్పందించలేదు. సంగారెడ్డి శివారులో అతడు హత్యకు గురయ్యాడని పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి అబ్దుల్‌ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని