Aryan Khan: ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ వాయిదా
మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ మరో రోజుకు వాయిదా పడింది.....
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ మరో రోజుకు వాయిదా పడింది. దీంతో అతడు మరో రోజు జైల్లో గడపనున్నాడు. ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తరఫున వాదించిన ఏఎస్జీ అనిల్కుమార్ సింగ్ తన వాదనలు కొనసాగించిన నేపథ్యంలో కేసు విచారణను కోర్టు గురువారం నాటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కేసు విచారణ కొనసాగనుంది.
విచారణ సందర్భంగా ఆర్యన్ఖాన్కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు తెలిపింది. తమ విచారణలో ఈ విషయం బహిర్గతమైనట్లు పేర్కొంది. అయితే పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. అయితే ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు తెలిపింది.
ఆర్యన్ఖాన్ తరఫున వాదించే సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. ఎన్సీబీ దాడి చేసిన సమయంలో రేవ్ పార్టీ జరుగుతున్న క్రూజ్ నౌకలోనే లేడని వాదించారు. పార్టీకి వెళుతుండగా ఆర్యన్తోపాటు మరో వ్యక్తి అర్బాజ్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అర్బాజ్ వద్ద 6 గ్రాముల చరాస్ (మత్తు పదార్థం) దొరికినట్లు వెల్లడించారు. కాగా ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టుకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!