Hyderabad: అమ్మానాన్న క్షమించండి.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అమ్మానాన్న క్షమించండంటూ.. ఓ బీటెక్‌ విద్యార్థి సూసైడ్‌ నోటి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ మధురానగర్‌లో ఈ ఘటన జరిగింది.

Updated : 26 Aug 2023 12:52 IST

యూసఫ్‌గూడ: అమ్మానాన్న క్షమించండంటూ.. ఓ బీటెక్‌ విద్యార్థి సూసైడ్‌ నోటి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ మధురానగర్‌లో ఈ ఘటన జరిగింది. మధురానగర్‌కు చెందిన ద్రితేక్షణ్‌ వర్మ ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో సూసైడ్‌ నోట్‌ రాసి శనివారం ద్రితేక్షణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని