Crime News: మహిళా న్యాయవాదికి సైబర్‌ ముఠా టోకరా.. రూ.52 లక్షలు కొల్లగొట్టిన నేరస్థులు

Eenadu icon
By Crime News Team Published : 01 Nov 2025 12:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు (Crime News). ఇటీవల మహిళా న్యాయవాదికి ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించారు. ఆమె వద్ద నుంచి రూ.52 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. యూపీ, దిల్లీ, మహారాష్ట్రలో 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కీలక సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఈ సైబర్‌ ముఠా దేశంలో రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ప్రాథమిక సమాచారం. (Andhra Pradesh News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని