Digital Arrest: డిజిటల్‌ అరెస్టు పేరిట.. వృద్ధుడికి రూ.51 లక్షలు టోకరా!

Eenadu icon
By Crime News Team Updated : 30 Oct 2025 20:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడి నుంచి సైబర్‌ కేటుగాళ్లు రూ.51 లక్షలు కాజేశారు. నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. బాధితుడు (78) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందారు. బాంబు పేలుళ్లు, కిడ్నాప్‌ కేసుల్లో మీ సిమ్‌ వాడారంటూ ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఏసీపీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆయనకు వాట్సప్‌ కాల్‌ చేశారు. సీబీఐ పేరుతో ఉన్న నోటీసులు చూపి బెదిరించారు. బాధితుడి పేరుతో ఇతరులు సిమ్‌ కార్డులు తీసుకున్నట్లు నమ్మించారు. 

మనీలాండరింగ్‌లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. డిజిటల్‌ అరెస్టు పేరిట వీడియో కాల్‌లో 24 గంటలపాటు నిర్బంధించారు. ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దర్యాప్తు అనంతరం తిరిగి ఇస్తామని చెప్పారు. కేసు భయంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
Published : 30 Oct 2025 20:23 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని