Sangareddy: పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 

Published : 13 Feb 2024 21:54 IST

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీఎంఎస్‌ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో సమీపంలో ఉన్న వనమాలి పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది  వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమంలో 11 మంది కార్మికులు ఉన్నట్లు  సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని