పిడుగు పాటుకు నలుగురి మృతి
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.
ఆలూరు, హాలహర్వి, కోసిగి, ఉయ్యాలవాడ - న్యూస్టుడే: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బలగోటలో వివాహ వేడుకకు వచ్చిన బంధువుల్లో కొందరు ఉక్కపోతగా ఉండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలై.. వారు కూర్చున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో కర్ణాటకకు చెందిన బసవరాజ్గౌడ్(30), ఉత్నూరుకు చెందిన శేఖర్ గౌడ్(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన రైతు మాలదాసరి ఈరేష్ (38) గురువారం భార్య రత్నమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం పడుతోందని చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడి ఈరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన భార్యను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) అనే యువకుడిపై పిడుగు పడటంతో కన్నుమూశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
Crime: ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించేందుకు ఏకంగా విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకున్నాడు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయాల నుంచి ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. -
ఓటేసేందుకు వచ్చి.. మృత్యుఒడికి చేరి
ఓటుహక్కు వినియోగించుకునేందుకు యువత నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపారు. -
ఓటేయడానికి వెళుతూ.. కుమారుడు సహా దంపతుల మృత్యువాత
హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సొంతూరు వెళుతున్న దంపతులు, ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రహదారి పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద వీరు అల్పాహారం తింటుండగా.. -
ఎన్నికల విధుల్లో ఇద్దరు ఉద్యోగుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం ఒకరు చనిపోగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆదివారం రాత్రి మరొకరు మృతిచెందారు. -
ఇద్దరు వృద్ధుల దుర్మరణం
వేర్వేరు గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్తూ ఇద్దరు వృద్ధురాళ్లు మృతిచెందారు. ఒకరు ఓటు వేయకుండానే.. మరొకరు ఓటు వేశాక మరణించారు. -
ఐఈడీ బాంబులు పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు బాలురు మృతి చెందారు. -
మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రగఢ్ కత్రన్గట్ట అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు