పిడుగు పాటుకు నలుగురి మృతి

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు.

Updated : 02 Jun 2023 06:18 IST

ఆలూరు, హాలహర్వి, కోసిగి, ఉయ్యాలవాడ - న్యూస్‌టుడే: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం పిడుగుల బారిన పడి వివిధ ఘటనల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బలగోటలో వివాహ వేడుకకు వచ్చిన బంధువుల్లో కొందరు ఉక్కపోతగా ఉండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలై.. వారు కూర్చున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో కర్ణాటకకు చెందిన బసవరాజ్‌గౌడ్‌(30), ఉత్నూరుకు చెందిన శేఖర్‌ గౌడ్‌(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన రైతు మాలదాసరి ఈరేష్‌ (38) గురువారం భార్య రత్నమ్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం పడుతోందని చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడి ఈరేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన భార్యను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) అనే యువకుడిపై పిడుగు పడటంతో కన్నుమూశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని