Heart Attack: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది.
గంగాధర, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి (16) ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే సందర్భంగా తోటి విద్యార్థులతో నృత్యం చేస్తూ.. ప్రదీప్తి కుప్పకూలింది. కళాశాలలో ఉన్న వైద్య సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తికి చిన్న వయసు నుంచే గుండెకు రంధ్రం ఉందని, శస్త్రచికిత్స జరిపించాలని అప్పట్లో వైద్యులు సూచించారు. ఆర్థిక స్తోమత లేక తల్లితండ్రులు శస్త్రచికిత్స చేయించలేకపోయారు.
అలాంటి పిల్లలు అతిగా శ్రమించొద్దు
ఈనాడు, హైదరాబాద్: గుండెజబ్బుతో బాధపడుతున్న చిన్నారులు ఎట్టిపరిస్థితుల్లోనూ అతిగా శ్రమించవద్దని రెయిన్బో హాస్పిటల్ పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ కోనేటి నాగేశ్వర్రావు సూచించారు. తీవ్రంగా శ్రమకు గురైనప్పుడు ఉన్నట్టుండి గుండె వైఫల్యం బారినపడే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కరీంనగర్లో ఓ విద్యార్థిని నృత్యం చేస్తూ చనిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తేగా గుండెజబ్బుతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘ఈనాడు’కు వివరించారు. ‘‘పిల్లల్లో సుమారు 50 రకాల గుండెజబ్బులు ఉంటాయి. ఇందులో గుండెలో రంధ్రం; గుండె నుంచి శరీరానికి, ఊపిరితిత్తులకు పోయే రక్తనాళాల్లో అడ్డంకులు(బ్లాక్); గుండె స్పందనలో తేడాలు విపరీతంగా ఉండడం- ఈ 3రకాలను ఎక్కువగా చూస్తుంటాం. గుండెలో రంధ్రం ఉన్న బాధితులుఅతిగా శ్రమిస్తే ఊపిరితిత్తుల్లో రక్తపోటు రెండు, మూడింతలు పెరిగిపోయే ప్రమాదముంది. శ్వాసకోశాల్లో శుభ్రమవ్వాల్సిన రక్తం.. అపరిశుభ్రంగానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే మెదడుకు చేరుతుంది. దీంతో తలతిరిగి ఉన్నట్టుండి కింద పడిపోతారు. కొందరు చనిపోయే ప్రమాదమూ ఉంది. మిగతా రెండు రకాల బాధితులకు కూడా విపరీతమైన శారీరక శ్రమ పనికిరాదు. ఒకవేళ ఏదైనా కారణంతో చికిత్స పొందడం ఆలస్యమైతే.. కనీసం ఆర్నెల్లకోసారి అయినా వైద్యుడిని సంప్రదించాలి. ఈలోగా శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు, నృత్యం, క్రీడల్లో చిన్నారులు పాల్గొనకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వివరించారు.
గుండె జబ్బులున్న పిల్లలను తొలిదశలో గుర్తించడం ఇలా...
- బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. పాలు తాగాలనుకున్నా తాగలేరు. తక్కువ తక్కువగా తాగి నిద్రపోతుంటారు. ఎదుగుదల ఉండదు.
- పాలు తాగేటప్పుడు బాగా చెమట కారుతుంది.తరచూ నిమోనియా బారిన పడుతుంటారు. డొక్కలు ఎగరేస్తుంటారు.
- కొందరు నీలి రంగులో మారుతారు.
- సాధారణ పిల్లల్లా ఆడుకోలేరు. పరుగెత్తలేరు. నీరసంగా ఉంటుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
-
కాయ్ రాజా కాయ్.. గెలిచేది కూటమేనోయ్!
-
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి