Khammam: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడిన ఘటన శనివారం తెల్లవారుజూమున చోటు చేసుకుంది.

Updated : 09 Mar 2024 19:07 IST

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తోంది. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని